Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడిపై కీలక అప్‌డేట్.. ఉగ్రవాదులకు సాయం చేసిన నిందితుడు అరెస్టు

పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ కాల్పులకు పాల్పడ్డ ఉగ్రవాదులు ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్‌లను వినియోగించి తమకు కావాల్సిన పరికరాలు కొనుగోలు చేసినట్లు దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది.

New Update
Pahalgam terrorists bought mobile chargers online to stay connected with handlers

Pahalgam terrorists bought mobile chargers online to stay connected with handlers

ఈ ఏడాది ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ఘటనకు సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ కాల్పులకు పాల్పడ్డ ఉగ్రవాదులు ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్‌లను వినియోగించి తమకు కావాల్సిన పరికరాలు కొనుగోలు చేసినట్లు దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది. ఆ ఉగ్రవాదులకు సాయం చేసిన ఓ ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్‌ (OGW)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి కీలక సమాచారం రాబట్టారు.  

Also read: పుణె యూనివర్సిటీకి రూ.2.46 కోట్ల కుచ్చుటోపీ.. తెలుగు ఇంజినీర్‌ అరెస్టు

ఆపరేషన్ మహాదేవ్‌ జరుగుతున్నప్పుడు ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి 3 మొబైల్ ఛార్జర్లను స్వాధీనం చేసుకున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఆ తర్వాత దర్యాప్తులో జరిగిన టెక్నికల్‌ వెరిఫికేషన్‌లో ఓ ఛార్జర్‌ ఓ ఫోన్‌తో వచ్చినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. దీన్ని ఓ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌పై కొన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. స్థానికంగా ఉంటున్న ఇక్బాల్‌ కంప్యూటర్స్‌కు చెందిన ముసాయిబ్‌ అహ్మద్‌ చోపాన్ అనే వ్యక్తి దాన్ని కొన్నట్లు గుర్తించామని తెలిపారు. అహ్మద్‌ దాన్ని కుల్గాం జిల్లాలోని యూసఫ్‌ కటారి (26)కి అమ్మేసినట్లు అంగీకరించనట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత యూసఫ్‌ను విచారించగా తానే డాచిగావ్‌ అడవుల్లో దాక్కున్న ఉగ్రవాదులకు వాటిని అందించినట్లు చెప్పాడని తెలిపారు.   

Also Read: కావాలని కుట్ర చేశారు..యూఎన్ చేదు అనుభవాలపై దర్యాప్తుకు ఆదేశించిన ట్రంప్

చివరికి ఈ దాడిలో ఉగ్రవాదులకు అవసరమైన వస్తువులు సరఫరా చేసినందుకు యూసఫ్‌ కటారిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలాఉండగా ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఈ విషాద ఘటనలో 26 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడికి పాల్పడ్డ ముగ్గురు టెర్రరిస్టులను జులై 29న ఇండియన్ ఆర్మీ ఆపరేషన్‌ మహాదేవ్‌లో భాగంగా హతం చేశాయి. మృతుల్లో సులేమాన్ అలియాస్ అసిఫ్ ఈ ఘటనకు మాస్టర్‌ మైండ్‌గా ఉన్నట్లు గుర్తించారు. మిగతా ఇద్దరు జిబ్రాన్, హమ్జా అఫ్గానీగా గుర్తించారు. 


Also Read: కాశ్మీర్ లో జెన్ జెడ్ నిరసనలకు కారణం ఏంటి? ఎందుకు వాళ్ళకు సడెన్ గా అంత కోపం వచ్చింది?

Advertisment
తాజా కథనాలు