దేశవ్యాప్తంగా 22 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు..
దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. మొత్తం 22 ప్రాంతాల్లో ఎన్ఐఏ ఆకస్మిక తనిఖీలు చేస్తోంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసు విచారణలో భాగంగానే ఈ తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. మొత్తం 22 ప్రాంతాల్లో ఎన్ఐఏ ఆకస్మిక తనిఖీలు చేస్తోంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసు విచారణలో భాగంగానే ఈ తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
రామేశ్వరం కేఫ్ బాంబు దాడి కేసుతో సంబంధం ఉన్న నలుగురు నిందితులపై NIA ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. ఈ నిందితులు జనవరి 22న అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగిన రోజున కర్ణాటక బీజీపీ ప్రధాన కార్యాలయ వద్ద బాంబు పెట్టేందుకు ప్లాన్ వేసినట్లు పేర్కొంది.
వాంటేడ్ ఐఏఎస్ ఉగ్రవాది లిస్ట్ లో ఉన్న రిజ్వాన్ అబ్దుల్ ను ఎన్ఐఏ ఢిల్లీ లో అరెస్ట్ చేసింది.కొన్నేళ్ల క్రితం పూణెలో ఏడుగురు ఐఎస్ ఉగ్రవాదులను ఎన్ఐఏ చేసి వారి నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకుంది.ఈ కేసులో రిజ్వాన్ అబ్దుల్ సహా ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు.
జమ్మూలోని కథువా జిల్లా మస్చెడి ప్రాంతంలో భారత సైన్యం వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు.దీనికి భద్రతా బలగాలు కూడా ధీటుగా బదులిచ్చాయి.అయితే గత రెండు నెలలుగా జరుగుతున్న ఉగ్రదాడులకు లష్కర్ ఉగ్రవాద సంస్థకు చెందిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' ప్రధాన కారణమని NIA పేర్కొంది.
ఎట్టకేలకు రషీద్ ఇంజనీర్ ప్రమాణం చేసేందుకు ఎన్ఐఏ అనుమతి ఇచ్చింది. ఈ నెల ఐదున ఆయన పార్లమెంటులో ప్రమాణ స్వీకారం అనుమతి లభించింది. అయితే మీడియాతో మాట్లాడ కూడదని షరతు విధించింది.
సీఎం అరవింద్ కేజ్రీవాల్పై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. ఖలిస్థాన్ ఉగ్రవాద సంస్థ 'సిఖ్ ఫర్ జస్టీస్' నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి నిధులు అందాయనే ఆరోపణలతో దర్యాప్తు చేయాలని ఎల్జీ.. ఎన్ఐఏకు సిఫార్సు చేశారు.
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో జరిగిన పేలుడు కేసులో కీలక చర్యలు తీసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారితో సహా ఇద్దరి వ్యక్తులను కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. అంతకముందు ప్రధాన నిందితుడిని పట్టిస్తే 10లక్షలు రివార్డ్ ను ఇస్తామని కేంద్రం ప్రకటించింది.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్ లో పేలుడు కేసుకి సంబంధించిన కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. కేఫ్ ప్రాంగణంలో బాంబు పెట్టిన షాజిబ్ హుస్సెన్ కీలక పాత్ర వ్యవహరించాడు.
పశ్చిమ బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో NIA బృందంపై ప్రజలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఏజెన్సీ అధికారి ఒకరు గాయపడ్డారని ఎన్ఐఏ తెలిపింది .2022 లో జరిగిన బాంబు పేలుళ్లపై తృణమూల్ కాంగ్రెస్ నాయకులను విచారించేందుకు NIA అక్కడికి వెళ్లాల్సివచ్చింది.