Bayya Sunny Yadav: భయ్యా సన్ని యాదవ్‌కు పాకిస్థాన్‌తో లింక్ ?.. NIA విచారణ

పాక్‌ నుంచి వచ్చిన భయ్యా సన్ని యాదవ్‌ను చెన్నై ఎయిర్‌పోర్టులో NIA అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్‌లో అతడు ఎవరితోనైనా సంబంధాలు కలిగి ఉన్నాడా ? లేదా ఏదానా గూఢచర్యం చేశాడా ? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. 

New Update
NIA Arrested Youtuber Bayya Sunny Yadav, investigation underway whether he had any connections with anyone in Pakistan

NIA Arrested Youtuber Bayya Sunny Yadav

తెలుగు యూట్యూబర్‌ భయ్యా సన్నీ యాదవ్‌ను NIA అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే పాకిస్థాన్‌కు బైక్‌పై వెళ్లిన అతడు తాజాగా భారత్‌కు వచ్చాడు. చెన్నై ఎయిర్‌పోర్టులో అధికారులు సన్నీ యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు పాకిస్థాన్‌కు వెళ్లిరావడంతో దీనికి సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. పాక్‌లో అతడు ఎవరితోనైనా సంబంధాలు కలిగి ఉన్నాడా ? లేదా ఏదానా గూఢచర్యం చేశాడా ? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. 

Also Read: కరోనా పేషేంట్ ని చంపేయ్.. ఇద్దరు డాక్టర్లు మాట్లాడుకున్న ఆడియో వైరల్!

Also Read :  పాకిస్తాన్‌తో అఫ్గనిస్తాన్ యుద్ధం.. భీకర కాల్పులు

NIA Arrested Bayya Sunny Yadav

సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని ఇప్పటికే పోలీసు కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే పాకిస్తాన్ బైక్ టూర్‌ను పూర్తి చేసి ఇండియాకు వస్తున్నట్లు అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో చెన్నై ఎయిర్‌పోర్టుకు చేరుకున్న పోలీసులు, NIA అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అంశంలో కూడా పోలీసులు అతడిని విచారించించనున్నట్లు తెలుస్తోంది. 

ఇదిలాఉండగా ఆపరేషన్ సిందూర్‌ అనంతరం పాక్‌ గూఢచర్యం చేసిందనే ఆరోపణలతో యూట్యూబర్‌ జ్యోతి మల్గో్త్రతో పాటు ఇతరులను NIA అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌ అధికారులతో పాటు ఐఎస్‌ఐతో కూడా ఆమెకు మంచి సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. జ్యోతి పాక్‌కి వెళ్లిన వీడియోలు కూడా చాలా ఉన్నాయి. మూడుసార్లు ఆమె పాక్‌కు వెళ్లొచ్చినట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్‌ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ముందు కూడా ఆమె పాక్‌కి వెళ్లొచ్చినట్లు గుర్తించారు.  

Also Read: పాక్‌ ర్యాలీలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు.. భారత్‌పై మరోసారి విద్వేష ప్రసంగం

ప్రస్తుతం జ్యోతి మల్హోత్రా హర్యానా జైల్లో ఉంది. తొమ్మిది రోజుల పాటు అధికారులు ఆమెను ప్రశ్నించారు. జ్యోతి డైరీని కూడా చేసుకున్నారు. అందులో జ్యోతి మనమందరం ఒకే భూమికి, ఒకే నేలకి చెందినవారమని తన డైరీలో జ్యోతి రాసుకుంది. పాకిస్తాన్ ఆతిథ్యం బాగుందని జ్యోతి తన డైరీలో ప్రశంసించింది. అలాగే అక్కడ దేవాలయాలు, గురు ద్వారాలు వంటి మతపరమైన ప్రదేశాలు బాగున్నాయని తెలిపింది. వీటిని అందరూ కూడా ఈజీగా చేరుకోవచ్చని చెప్పింది. దేశ విభజన సమయంలో విడిపోయిన కుటుంబాలతో మళ్లీ తిరిగి కలవాలనే కోరిక ఉందని కూడా ఆమె డైరీలో ప్రస్తావించిందని పోలీసులు తెలిపారు. 

Also Read :  తెల్లటి మచ్చలను వదిలించుకోవాలనుకుంటున్నారా? ఇలా చేయండి

bayya sunny yadav case | bayya sunny yadav betting apps

Advertisment
Advertisment
తాజా కథనాలు