NIA: పహల్గాం దాడి ఉగ్రవాదులు భారత్ లోనే ఉన్నారు...ఎక్కడంటే?

ఏప్రిల్ 22న పహల్గాంలో దారుణ మారణకాండ సృష్టించిన ఉగ్రవాదులు భారత్ లోనే ఇంకా ఉన్నారని ఎన్ఐఏ చెబుతోంది. వాళ్ళు పక్కా ప్రణాళిక ప్రకారం తప్పించుకున్నారని..ప్రస్తుతం దక్షిణ కాశ్మీర్ లో ఓ చోట తల దాచుకున్నారని చెబుతున్నారు. 

author-image
By Manogna alamuru
New Update

పహల్గాం దాడి ఉగ్రవాదులు సురక్షితంగా భారత్ లోనే ఉన్నారు. స్థానికులే వారికి ఆశ్రయమిచ్చారు. వారికి అన్ని సదుపాయాలు కూర్చి చక్కగా చూసుకుంటున్నారని చెబుతోంది ఎన్ఐఏ. పక్కా ప్రణాళిక ప్రకారమే ఉగ్రవాదులు దాడి చేశారని..ఆ తరువాత కూడా ఎక్కడ దాక్కోవాలి, భారత భద్రతా దళా నుంచి ఎలాతప్పించుకోవాలని ముందే ప్లాన్ చేసుకున్నారు. దానికి తగ్గ ఏర్పాట్లను కూడా ముందే చేసుకున్నారు. ఉగ్రవాదులు స్వయం సమృద్ధి కలిగి ఉన్నారని...వారికి కావాల్సిన సదుపాయాలన్నీ చక్కగా అందుతున్నాయని ఎన్ఐఏ అంచనాకు వచ్చింది. దీనికి సంబంధించి జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. 

అధునాతనమైన ఫోన్లు..

ఉగ్రవాదుల దగ్గర అధునాతనమైన పరికరాలు ఉన్నాయి. అందుకే వారు పోలీసులు నుంచి ఈజీగా తప్పించుకోగలుగుతున్నారని రిటైర్డ్ రక్షణ నిపుణుడు మేజర్ జనరల్ యస్ మోర్ అంటున్నారు. ఈ ఫోన్లు కారణంగానే భద్రతా దళాలు వారి జాడ కనిపెట్టేకపోయారని చెప్పారు. దాడి సమయంలో కూడా మూడు ఉపగ్రహ ఫోన్లు ఉపయోగించారని...వాటి కారణంగానే భద్రతా దళాలు వారి జాడ తెలుసుకోలేకపోయారని తెలిపారు. వీరికి స్థానికులు కూడా చాలా సహాయం చేస్తున్నారని అన్నారు. 

ఇక పహల్గామ్ దాడికి ముందు బైసరన్ లోయలో దాదాపు 48 గంటల ముందే ఉగ్రవాదులు ఉన్నట్లుగా ఎన్ఐఏ ఆధారాలు సేకరించింది. ముందే రెక్కీ నిర్వహించి.. భారీగా జనం వచ్చాక అదునుచూసి ఎటాక్ చేసినట్లుగా కనిపెట్టారు. నాలుగు ప్రదేశాల్లో దర్యాప్తు సంస్థ కీలక ఆధారాలు సేకరించింది. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించింది. ఉగ్రవాదులకు స్థానికుల సహకారం పూర్తిగా ఉన్నట్లు ఒక అంచనాకు వచ్చింది. 

today-latest-news-in-telugu | nia 

Also Read: JD Vance: ఉగ్రవాదంపై భారత్ పోరాటానికి మద్దతివ్వండి..పాక్ కు జేడీ వాన్స్ సూచన

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు