బీజేపీ స్టేట్ చీఫ్గా ఈటల రాజేందర్ | Telangana BJP New Cheif Updates | RTV
బీజేపీ స్టేట్ చీఫ్గా ఈటల రాజేందర్ | BJP Circles in Telangana spreads talk that BJP New Cheif is going to be MP Eetela Rajender | RTV
బీజేపీ స్టేట్ చీఫ్గా ఈటల రాజేందర్ | BJP Circles in Telangana spreads talk that BJP New Cheif is going to be MP Eetela Rajender | RTV
గత బీఆర్ఎస్ పాలనలో దేవాదాయ భూములు పెద్ద ఎత్తున కబ్జాకు గురయ్యాయని, ఆ పార్టీ నేతలు భూములు కబ్జా చేశారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ భూ కబ్జాలపై త్వరలోనే విచారణ ప్రారంభిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజకీయ నాయకులు రోజూ ఏదో ఓ కార్యక్రమంలో మాట్లాడుతుంటారు. అలాంటప్పుడు వారి సహనం కోల్పోయి బూతులు తిట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. పాడి కౌశిక్ రెడ్డి, హరీశ్ రావు, కేటీఆర్, జగ్గారెడ్డి, బండి సంజయ్, ఎంపీ అర్వింద్ లు కొంచెం ఘాటుగా విమర్శలు చేస్తుంటారు.
లగచర్ల ఘటనపై కేటీఆర్ ను అరెస్ట్ చేయాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అంటే.. పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేముందని ఎంపీ ఈటల రాజేందర్ స్టేట్మెంట్ ఇచ్చారు. వీరిద్దరి వ్యాఖ్యలకు భిన్నంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే అంటూ కిషన్ రెడ్డి విమర్శించారు.
మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి ఫన్నీ కామెంట్స్తో వార్తల్లో నిలిచారు. ఎంపీ ఈటల రాజేందర్తో కలిసి కీసర ఎంపీడీవో కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫొటోలు మంచిగా రావాలంటూ అందరినీ నవ్వించారు. వీడియో వైరల్ అవుతోంది.
నగరంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టడం సంతోషమే కానీ.. సామాన్యులను ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకోమని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించలేకే వాళ్లని డైవర్ట్ చేయడానికి హైడ్రాను ముందు పెట్టారని ఆరోపించారు.
అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేయడాన్ని ఎంపీ ఈటల రాజేందర్ వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హైడ్రా చర్యలను సమర్ధిస్తున్నారు. ప్రభుత్వ విధానంపై బీజేపీ ఎంపీలు ఇలా ద్వంద్వ వైఖరి అవలంబిస్తుండటంతో పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరనే ఉత్కంఠకు ఇంకా తెరపడలేదు. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు అధిష్ఠానంతో లాబీయింగ్ చేస్తున్నారు. అధ్యక్ష పదవి అంశంతో పాటు బీజేపీకి సంబంధించిన విషయాలను మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆర్టీవీతో పంచుకున్నారు. ఈ వీడియో చూడండి.
మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచిన ఈటల రాజేందర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈటల రాజేందర్ బీసీ సామాజిక వర్గం, ఉద్యమకారుడు కావడంతో ఆయన వైపు బీజేపీ అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.