జూబ్లీహిల్స్ లో BJP ఓటమికి కారణం వాళ్లే.. ఈటల సంచలన వ్యాఖ్యలు!

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. బీజేపీ అభ్యర్థిని చివరివరకు ప్రకటించకపోవడం అనేదే పెద్ద మైనస్ అన్నారు.

New Update
eetala rajendar responds on jubileehills bypoll results

eetala rajendar responds on jubileehills bypoll results

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. బీజేపీ అభ్యర్థిని చివరివరకు ప్రకటించకపోవడం అనేదే పెద్ద మైనస్ అన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు ఎన్నికలకు 6 నెలల ముందు నుంచే గ్రౌండ్‌ వర్క్ చేశాయని పేర్కొన్నారు.  హిందూ, ముస్లిం విభజన రాజకీయాలు చేసి రాష్ట్రంలో అధికారంలోకి రాలేమని పేర్కొన్నారు. రాజకీయ నేతలు మత ప్రతిపాదికన రాజకీయాలు చేయొద్దని సూచించారు. 

Also Read: పోలీసులకు చుక్కలు చూపించిన ఏడో తరగతి బాలిక.. స్కూలుకు వెళ్లడం ఇష్టం లేక ఏం చేసిందంటే?

ఉప ఎన్నికల్లో అధికారిక పార్టీకే అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. దుబ్బాక, హుజురాబాద్‌ ఉపఎన్నికల్లో మాత్రం బీజేపీ గెలిచిందని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడ్డాక ఇప్పటిదాకా 9 ఉపఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. అందులో అధికార పార్టీయే ఆరుసార్లు గెలిచిందని అన్నారు. రేవంత్‌ పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు హుజురాబాద్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 3 వేల ఓట్లు మాత్రమే వచ్చాయని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌.. దాదాపు 25 వేల ఓట్ల మెజార్టీతో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై గెలిచిన సంగతి తెలిసిందే. 

Also Read: సౌదీలో మరణిస్తే మృతదేహాన్ని ఇవ్వరు.. ఈ రూల్‌ గురించి తెలుసా ?

Advertisment
తాజా కథనాలు