Parcel Bomb: పెళ్లి గిఫ్ట్గా పార్సల్ బాంబ్.. ఇద్దరిని చంపిన లెక్చరర్కి శిక్ష ఏంటో తెలుసా?
తల్లి మీద కోపంతో ఓ లెక్చరర్ ఆమె కొడుకు పెళ్లికి పార్సల్ బాంబ్ గిఫ్ట్ పంపాడు. దీంతో పెళ్లికొడుకు అతని నాయనమ్మ చనిపోయారు. 2018 కేసులో ఒడిశా బొలాంగిర్ జిల్లా కోర్టు బుధవారం పంజీలాల్ మెహర్కు జీవితఖైదుతోపాటు రూ.1.70 లక్షల జరిమానా విధించింది.