Maoist: దారుణం.. ముగ్గురిని హతమార్చిన మావోయిస్టులు
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ గ్రామంలో మావోయిస్టులు ముగ్గురు వ్యక్తులను హత్య చేశారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం పెద్దకోర్మ గ్రామంలో జరిగింది.
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ గ్రామంలో మావోయిస్టులు ముగ్గురు వ్యక్తులను హత్య చేశారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం పెద్దకోర్మ గ్రామంలో జరిగింది.
ఆపరేషన్ కగార్లో భాగంగా ఛత్తీష్గఢ్లో హై అలర్ట్ నెలకొంది. 15కిలోమీటర్ల మేర 15వేల మంది భద్రతా బలగాలు దండకారణ్యాన్ని చుట్టుముట్టాయి. మావోయిస్టు అగ్రనేతలంతా ఒకే దగ్గర ఉన్నారనే సమాచారంతో అడవిలోకి చొచ్చుకెళుతున్నాయి. దీంతో కొందరు లొంగిపోతామంటున్నారట.
ప్రధాన కార్యదర్శి కేశవరావు మృతితో మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీకి కొత్త దళపతిని ఎన్నుకోనుంది. గణపతి, మల్లోజుల వేణుగోపాల్, బెంగాల్కు చెందిన రాజా పదవి రేసులో ఉండగా.. గణపతికే మళ్లీ పార్టీ పగ్గాలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
మావోయిస్టుల భారీ ఎన్కౌంటర్పై అమిత్ షా సంచలన పోస్ట్ పెట్టారు. 'నక్సలిజంపై చేస్తున్న మూడు దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా కలిగిన నాయకుడిని మట్టుబెట్టడం ఇదే తొలిసారి. నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఒక మైలురాయి విజయం' అన్నారు.
మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్గఢ్ బీజాపుర్ జిల్లా ముర్కరాజుగుట్టల అడవుల్లో భద్రతా బలగాలు భారీ బంకర్లను గుర్తించాయి. అగ్రనేతలకు సంబంధించిన 12 స్థావరాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.
ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని బడేశెట్టి తొలి నక్సల్ రహిత గ్రామంగా నిలిచింది. తాజాగా ఆ గ్రామానికి చెందిన 11మంది మావోయిస్టులు లొంగిపోవడంతో నక్సల్స్ ఫ్రీ విలేజ్ గా పోలీసులు ప్రకటించారు. ఈ గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. కోటి అందించనుంది.
గురువారం చత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మరో 22 మంది నక్సలైట్లను పోలీసులు అరెస్టు చేశారు. వాళ్ల నుంచి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన నక్సలైట్లలో 19 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్నవారు ఉన్నారు.
మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మరికొంతమంది దళ సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ములుగు జిల్లా యాకన్నగూడెంలో 22 మంది కీలక కమాండర్లు సరెండర్ అయినట్లు ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ తెలిపారు.
ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో దంతేశ్వరి అమ్మవారిని కేంద్రమంత్రి అమిత్ షా దర్శించుకున్నారు. అనంతరం పాండుం ముగింపు సభలో మాట్లాడారు. వచ్చే నవరాత్రికి ఎర్ర బీభత్సం అంతం కావాలన్నారు. గిరిజనుల అభివృద్ధిని మావోలు ఆపలేరని, జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు.