Massive encounter in Chhattisgarh | ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ | Bijapur Maoists Encounter | RTV
తాజాగా మరోసారి కాల్పుల మోతతో దండకారణ్యం దద్దరిల్లింది. గురవారం ఉదయం బీజాపుర్-దంతెవాడ జిల్లాల సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 22 మంది మావోయిస్టులు మృతి మృతి చెందారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ను వెంటనే ఆపివేయాలని ప్రొఫెసర్ జి.హరగోపాల్ డిమాండ్ చేశారు. ఆదివాసీలపై జరుగుతున్న దమనకాండపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని అన్నారు. దేశంలో అభివృద్ధి నమూనా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని విమర్శించారు.
ఛత్తీస్గఢ్లో గుర్తు తెలియని వ్యాధి కలవరపెడుతోంది. సుక్మా అనే జిల్లాలోని ఓ గ్రామంలో ఈ వ్యాధి వల్ల ఏకంగా 13 మంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. వీళ్లు నెల వ్యవధిలోనే చనిపోయినట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
మావోయిస్టులు మరో దారుణానికి పాల్పడ్డారు. ఛత్తీష్గడ్ సుక్మా జిల్లా పెంటపాడుకు చెందిన పటేల్ కల్ము హిడ్మా(65)ను గొంతు కోసి చంపేశారు. భూ దందాలకు పాల్పడుతున్నాడనే కారణంగా శిక్షించినట్లు మృతదేహం వద్ద లేఖ వదిలి వెళ్లడం సంచలనం రేపుతోంది.
మావోయిస్టులకు పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. ఛత్తీష్ గఢ్లో భారీ డంప్ స్వాధీనం చేసుకున్నారు. సుక్మా అడవులలో కూంబింగ్ నిర్వహిస్తున్న 203 కోబ్రా, 131 CRPF జవాన్లు.. మావోయిస్టుల ఆయుధాలతో పాటు పార్టీ కీలక సమాచారం కలిగిన 15 డైరీలు దొరికినట్లు తెలిపారు.
ఛత్తీష్గడ్ ఎన్కౌంటర్పై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపడంతో 24 మంది గ్రామస్తులు గాయపడ్డారని మండిపడ్డారు. దీనికి నిరసనగా ఫిబ్రవరి 18న బీజాపూర్, సుక్మా, దంతెవాడ జిల్లాల్లో బంద్కు పిలుపునిస్తున్నట్లు బహిరంగ లేఖలో తెలిపారు.
ఛత్తీస్గఢ్ కాంకేర్ ఎన్కౌంటర్పై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర కమిటీ సెక్రటరీ దామోదర్ మరణించలేదని తెలిపింది. 8వేల మంది పోలీసుల ఏకపక్ష దాడిలో 4గురు గ్రామస్థులు చనిపోయినట్లు సమత ప్రవక్త పేరుతో రిలీజ్ చేసిన లేఖలో స్పష్టం చేసింది.
ఛత్తీస్ఘడ్ గరియాబాద్ భారీ ఎన్ కౌంటర్లో నల్గొండ జిల్లా వాసి మృతిచెందాడు. చండూరు మండలం పుల్లెంలకు చెందని పాక హన్మంతు కాల్పుల్లో మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. 45ఏళ్ల క్రితం హనుమంతు మావోయిస్టు పార్టీలోకి వెళ్లగా ఆయన మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది.