Kumbhmela Accident: కుంభమేళాలో మరో ఘోర ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం.. హృదయవిదారక దృశ్యాలు!
వారణాసిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుంభమేళాకు వెళ్తున్న భక్తుల జీపు మీర్జామురాద్ సమీపంలోని జిటి రోడ్డులో ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా కర్ణాటకకు చెందినవారే.