Tirupathi: తిరుపతి-చెన్నై హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
చిత్తూరు జిల్లా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి, చెన్నై రోడ్డులో లారీ, బస్సు ఢీకొన్నాయి. ఇందులో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 14 మందికి గాయాలయ్యాయి.
చిత్తూరు జిల్లా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి, చెన్నై రోడ్డులో లారీ, బస్సు ఢీకొన్నాయి. ఇందులో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 14 మందికి గాయాలయ్యాయి.
హరియాణాలో ఫతేహాబాద్ లో పెళ్ళి వేడుకలో విషాదం చోటు చేసుకుంది. వేడుక నుంచి తిరిగి వస్తున్న ఓ జీపు అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు.
ఐర్లాండ్లో రోడ్డు ప్రమాదం జరిగిన ఘటనలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందడం కలకలం రేపింది. ఒకరు పల్నాడు జిల్లాకు చెందిన చెరుకూరి సురేష్ (26) కాగా.. మరొకరు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన చిట్టూరి భార్గవ్ (25)గా గుర్తించారు.
ఐర్లాండ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గండ్రాయికి చెందిన చిట్టూరి భార్గవ్ , పల్నాడు జిల్లా రొంపిచర్ల పడమటి పాలేనికి చెందిన చెరుకూరి సురేష్ గా అధికారులు గుర్తించారు.
టైర్ పగిలిపోవడంతో పొలాల్లోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లిన ఘటన సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంటాల వద్ద చోటు చేసుకుంది. దీంతో ప్రయాణికులకు తీవ్ర గాయల పాలయ్యారు. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.
ఇద్దరు ఉండాల్సిన చోట ఒక్కరే ఉంటే..ఇద్దరు చేయాల్సిన పని ఒక్కరే చేస్తే...అనర్థాలే జరుగుతాయి. దానికి నిదర్శనమే వాషింగ్టన్ విమాన ప్రమాదం. రీగన్ విమానాశ్రయంలో ట్రాఫిక్ కంట్రోల్ టవర్లో ఒకే సమయంలో రెండు విమానాలను, ఒక్కరే కంట్రోల్ చేయడం వలనే దారుణం జరిగింది.
వాషింగ్టన్ విమాన ప్రమాదంలో బాధితుల కోసం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికి పద్ధెనిమిది మంది మరణించారని తెలుస్తోంది. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు గడ్డకట్టే చలిలో...నీళ్ళల్లో పడిన వారు బతకడం కష్టమే అని చెబుతున్నారు.
అమెరికాలోని చికాగోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన మహమ్మద్ వాజిద్ మృతి చెందాడు. కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. నాలుగేళ్ల క్రితం ఉన్నత చదవుల కోసం అతడు అమెరికా వెళ్లాడు. కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ప్రయాగ్రాజ్ కుంభమేళాలో జనవరి 28న జరిగిన తొక్కిసలాటలో 20 మంది మృతి చెందారు. 1954న జరిగిన కుంభమేళలో కూడా 800 మంది తొక్కిసలాటలో మరణించారు. 1986 హరిద్వార్ కుంభమేళా, 2003 మహారాష్ట్ర నాసిక్ కుంభమేళాలో కూడా విషాదం చొటుచేసుకుంది.