Tractor Accident: బస్సు బోల్తా..20 మంది స్పాట్ లోనే..!
రేణిగుంట మర్రిగుంట సర్కిల్ వద్ద ట్రాక్టర్ ని తప్పించబోయి డిక్సన్ కంపెనీకి చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మందికి తీవ్రగాయాలు కాగా..వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
రేణిగుంట మర్రిగుంట సర్కిల్ వద్ద ట్రాక్టర్ ని తప్పించబోయి డిక్సన్ కంపెనీకి చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మందికి తీవ్రగాయాలు కాగా..వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
మెదక్లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో స్పాట్లోనే ముగ్గురు మృతి చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉంది. అతి వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
బెంగళూరులో పట్టపగలే సినిమా రేంజ్ రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంలో ఉన్న వాటర్ ట్యాంకర్ మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపు తప్పింది. దీంతో నడి రోడ్డు పై మూడు పల్టీలు కొట్టింది.
హైదరాబాద్ నగరంలోని సూరారంలో లిఫ్ట్ ప్రమాదం జరిగింది. సూరారంలోని సాయి మణికంఠ రెసిడెన్సీలో లిఫ్ట్ మీద పడటంతో అక్బర్ పాటిల్ (39) అనే వ్యక్తి మృతిచెందాడు. అపార్ట్మెట్ లిఫ్ట్ గుంతలో పడిన బంతిని తీసేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది
మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో కారు వంతెనపై నుండి పడిపోవడంతో నలుగురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చార్గవాన్-జబల్పూర్ రహదారిపై సాయంత్రం 4 గంటలకు ఈ సంఘటన జరిగింది.
హైదరాబాద్లో లారీ బీభత్సం సృష్టించింది. మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద విధుల్లోవున్న ట్రాఫిక్ పోలీసులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నాంపల్లి నియోజకవర్గం మురాద్నగర్లోని ఓ భవనంలో లిఫ్ట్ కుప్పకూలింది. దీంతో ఫోర్త్ ఫ్లోర్లో నుంచి గ్రౌండ్ ఫ్లోర్కు పడిపోయింది. ఈ ప్రమాదంలో సయ్యద్ నసీరుద్దీన్, సబీనా బేగంకు స్వల్ప గాయాలు కాగా.. మైమునా బేగం కాలు విరిగింది.
ఏపీ కర్నూలులో ఘోరం జరిగింది. నందవరం ముగతి క్రాస్ NH167 వద్ద రోడ్డు పక్కన వెళ్తున్న గొర్రెలకాపరులపైకి లారీ దూసుకెళ్లింది. లింగన్న అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. కొన్ని గొర్రెలు దుర్మరణం చెందాయి.
గుజరాత్లోని జామ్నగర్ సమీపంలో ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన యుద్ద విమానం సాంకేతిక సమస్యతో కూలిపోయింది.ఈ ఘటనలో ఓ పైలట్ మృతి చెందగా.. మరొకరు గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.