Ap Road Accident: ఏపీలో ఘోరం.. బోల్తా పడి పల్టీలు కొట్టిన కారు - ముగ్గురు స్పాట్ డెడ్
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి వద్ద నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని వస్తుండగా కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి.