/rtv/media/media_files/2025/01/09/DYUwfpM7hcptLY5hmxPa.jpg)
omar abdullah
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని దాయాది పాకిస్థాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, అంతలోనే ఆ దేశం మాట మార్చింది. పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి తాము సిద్దమని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఈ ప్రకటనపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు.
Also Read:TTD: వేసవి సెలవుల్లో వీఐపీ, సిఫార్సు లేఖలతో తిరుమల వెళ్తున్నారా.. అయితే మీకో చేదువార్త!
ముందు ఈ ఘటనను తోసిపుచ్చిన పాకిస్థాన్ .. భారత్పై నిందలు వేసిందని విమర్శించారు.. ఇప్పుడు దర్యాప్తునకు సిద్ధమనడం విడ్డూరంగా ఉందని ఆయన దుయ్యబట్టారు. ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని పాక్ సన్నాయి నొక్కులు నొక్కుతోంది.
Also Read: India-Pakistan: మేం ఆయుధాలు లేని సైనికులం..పోరాడేందుకు ఎప్పుడూ సిద్ధమే!
ఉగ్రదాడిపై నిష్పక్షపాత విచారణకు తాము సిద్ధమని పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలుత ఈ దాడిని పాకిస్తాన్ ఖండించిందని, భారత్పై నిందలు వేసిందని ఆయన గుర్తు చేశారు. పహల్గామ్లో జరిగిన దాడిని పాక్ గుర్తించలేదని ఒమర్ అన్నారు. మొదట ఈ దాడి వెనుక భారత్ ఉందని ఆరోపించారని ఆయన విమర్శించారు. మనపై ఆరోపణలు చేయడంలో ముందుండే వారికి ఇప్పుడేమీ చెప్పలేమని ఒమర్ అబ్దుల్లా అన్నారు.
వారి ప్రకటనలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాలనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ‘దురదృష్టకరమైన ఆ ఘటన జరిగి ఉండాల్సింది కాదు’ అని ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు.పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ.. ‘జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఘటనతో తమ దేశంపై నిందలు వస్తున్నాయి’ అని అన్నారు.
‘విషాదకర ఘటనతో మరోసారి మన దేశం నిందలు ఎదుర్కొంటోంది. ఆ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు మేం సిద్ధంగానే ఉన్నాం. శాంతికే మా ప్రాధాన్యం" అని షరీఫ్ పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని అన్నారు.
అమెరికా ప్రతిపాదనపై ఏకాభిప్రాయం రావడానికి ముందు అనేక చర్చలు జరిగాయి. పాకస్థాన్, చైనాతో కలిసి ప్రకటనలోని పదాలను మార్చడానికి ప్రయత్నించింది. గతంలో పుల్వామా, జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు దాడి వంటి ఉగ్రదాడులను మండలి ఖండించింది. స్థానిక ప్రభుత్వానికి సహకరించాలని కోరింది. కానీ, ఐరాస ప్రకటనలో భారత ప్రభుత్వ ప్రస్తావన ఉంటే తమకు ఇబ్బంది తప్పదని పాక్ అనుకుంది.
ఈ క్రమంలో పాక్ ప్రధాని దర్యాప్తునకు సిద్ధమని ప్రకటన చేసినట్టు సమాచారం. ఇక, సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నట్లు తెలుస్తుంది. దాయాది కవ్వింపు చర్యలకు పాల్పడుతూ రెచ్చగొడుతోంది.
Also Read: Pak: భారత్ పై మరోసారి అక్కసు వెళ్లగక్కిన పాక్ సైన్యాధిపతి!
Also Read: Russia-Ukrain-Putin: ఉక్రెయిన్ తో చర్చల పునరుద్దరణకు రెడీ..!
pakistan | india | jammu-kashmir | cm | Omar Abdullah | pahalgam | attack in Pahalgam | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates