విజయనగరంలో పాక్ ఉగ్రవాది అరెస్ట్ | Terrorist Arrested In Vizianagaram | Operation Sindoor | RTV
దేశానికి ముప్పు తలపెట్టేలా పాకిస్తాన్ కు సహాయం చేసిన జ్యోతి మల్హోత్రా ఇన్స్టాగ్రామ్ లో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. పహల్గాం సమాచారాన్ని చేరవేసింది జ్యోతినే అని తేలింది. ఆమె జనవరిలోనే పహల్గాంను సందర్శించి..అక్కడి విషయాలను పాకిస్తాన్ కు పంపినట్లు తేలింది.
విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి సంచలన చేశారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణ ప్రకటనలపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
భారత్పైకి డ్రోన్లు, మిస్సైల్స్తో దాడికి పాల్పడిన పాక్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పాక్కు ఆయువుపట్టుగా ఉన్న కరాచీ పోర్టును INS విక్రాంత్ పూర్తిగా నేలమట్టం చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా బుధవారం అర్థ రాత్రి వైమానిక దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడి తర్వాత కూడా జమ్మూ కశ్మీర్లో పాక్ నిరంతరం కాల్పులు జరుపుతోంది. సరిహద్దు అవతల నుంచి పాక్ కాల్పులు చేసింది.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ వైరల్ హల్చల్ చేస్తున్నాయి. ఉగ్రవాదులు దాడి చేస్తూ.. మీ మోదీకి చెప్పుకోండన్నారు. మోదీకి చెప్పామంటూ మీమ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాక్పై దాడులు నిర్వహించగా 90 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ముఖ్యంగా ఉగ్రవాద సంస్థ జైషే నాయకుడు, అజార్ మసూద్తో పాటు అతని కుటుంబం తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఉగ్రదాడిలో అతని కుటుంబానికి చెందిన 14 మంది సభ్యులు మృతి చెందారు.
పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఆపరేషన్ సిందూర్తో ఇండియన్ ఆర్మీ దాడులు నిర్వహించింది. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆపరేషన్ సిందూర్పై స్పందించారు. సెలవులో ఉన్న పారా మిలిటరీ బలగాలను వెనక్కి రప్పించమని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
పహల్గామ్ ఉగ్రదాడి ఘటనతో భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం రాజ్యమేలుతోంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే అణుదేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి స్పందించింది.