/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/ttd-jpeg.webp)
ttd
వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. సామాన్యులకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో టీటీడీ వీఐపీ, సిఫార్సు లేఖలపై దర్శనాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ బోర్డు సభ్యుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు ప్రకటించారు.
Also Read: India-Pakistan: మేం ఆయుధాలు లేని సైనికులం..పోరాడేందుకు ఎప్పుడూ సిద్ధమే!
ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మే, జూన్ రెండు నెలలపాటు వేసవి సెలవుల వల్ల కుటుంబాలతో శ్రీవారి దర్శనాలకు వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని చెప్పారు. వారు ఎలాంటి ఇబ్బందులకు లేకుండా.. దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో వీఐపీ బ్రేక్ దర్శనాలు, సిఫార్సు లేఖలపై దర్శనాలకు అనుమతించరాదని నిర్ణయించినట్టు పేర్కొన్నారు.
‘‘మే, జూన్ నెలల్లో వేసవి సెలవులుతో పాటు అన్ని పరీక్ష ఫలితాలు కూడా వెల్లడి కావడంతో తిరుపతికి కుటుంబ సమేతంగా వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
మే 1 నుంచి జూన్ 30 వరకు వీఐపీ దర్శనాలతో పాటు సిఫారసు లేఖలపై సేవలు, బ్రేక్ దర్శనాలు, సుప్రభాతం దర్శనాలు రద్దు చేస్తున్నట్లు" ఆయన ప్రకటించారు. అంటే, ఈ రెండు నెలల పాటు ప్రత్యేక దర్శనాలు అందుబాటులో ఉండవు. సాధారణ భక్తులకు ఎక్కువ సమయం కేటాయించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
ttd | tirumala | summer | holidays | rush | telugu-news | latest-telugu-news | latest telugu news updates