Everest mountain: ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి.. కొన్ని నిమిషాలకే భారత పర్వతారోహకుడి మృతి
పశ్చిమ బెంగాల్కి చెందిన సుబ్రతా ఘోష్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన కాసేపటికే చనిపోయాడు. తన గైడ్ చంపల తమంగ్తో కలిసి సుబ్రతా ఘోష్ శిఖరాన్ని అధిరోహించారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తిరిగి వస్తుండగా అనారోగ్యానికి గురై మృతి చెందినట్లు తెలుస్తోంది.