India Vs Pakistan War Tension🔴LIVE : హైదరాబాద్, విశాఖతో పాటు.. ఏపీ, తెలంగాణలో మాక్ డ్రిల్స్ జరిగే ప్రాంతాలివే!

author-image
By Manoj Varma
New Update
India Vs Pakistan War Tension

India Vs Pakistan War Tension

  • May 06, 2025 19:28 IST

    BIG BREAKING: పాకిస్తాన్ ఆర్మీ వాహనంపై దాడి.. అధికారితో పాటు ఆరుగురు సైనికులు దుర్మరణం!

    బలూచిస్తాన్‌లోని బోలాన్ ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. ఈ పేలుడులో ఒక అధికారి సహా ఆరుగురు సైనికులు మృతి చెందారు. మరో ఐదుగురు సైనికులు గాయపడ్డారు. ఆర్మీ వాహనం సాధారణ గస్తీలో ఉన్నప్పుడు ఈ దాడి జరిగింది.

    Pakistan Army in Balochistan



  • May 06, 2025 19:27 IST

    India Pak War: పాకిస్తాన్ టార్గెట్ హైదరాబాద్‌.. ఎందుకో తెలుసా?

    హైదరాబాద్‌లో రక్షణ రంగ సంస్థలు, జనసాంద్రత ఎక్కువ. దీంతో పాకిస్తాన్‌తో మనకు యుద్ధం వస్తే హైదరాబాద్‌పైనే దాడి చేసే అవకాశం ఉంది. అలాగే ఢిల్లీ, బెంగళూర్, చెన్నై, ముంబై నగరాలే పాక్ టార్గెట్‌ అయ్యే అవకాశం ఉంది. రేంజ్‌లో దాడి చేయగల మిస్సేల్స్ పాక్ దగ్గర ఉన్నాయి.

    hyd Mock drills 123



  • May 06, 2025 18:06 IST

    పాకిస్తానీయులను పంపించి వేయండి-గవర్నర్ కు బీజేపీ నేతల వినతి



  • May 06, 2025 17:39 IST

    BIG BREAKING: 'తెలంగాణలో పాకిస్తానీలు'

    తెలంగాణలో అక్రమంగా నివాసం ఉంటున్న పాకిస్తానీలను గుర్తించి వెనక్కు పంపించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ రోజు గవర్నర్ ను కలిసి వినతి పత్రం అందించారు. గవర్నర్ ను కలిసిన వారిలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, విజయ రామారావు తదితరులు ఉన్నారు.

    BIG BREAKING: తెలంగాణలో మరో ఎన్నికకు మోగిన నగారా



  • May 06, 2025 17:38 IST

    ఆ MP భార్యకి పాక్ ఆర్మీతో సంబంధాలున్నాయ్.. CM సంచలన ఆరోపణలు

    MP గౌరవ్ గగోయ్ భార్యకు పాకిస్తాన్ సైన్యంతో సంబంధాలు ఉన్నాయని అస్సాం సీఎం ఆరోపించారు. గౌరవ్ భార్య ఎలిజబెత్ కోల్‌బర్న్ 19 సార్లు పాకిస్తాన్‌కు వెళ్లారని హిమంత బిశ్వశర్మ మీడియా సమావేశంలో వెల్లడించారు. గౌరవ్ గోగోయ్ కూడా పాక్‌కు వెళ్లాడని అన్నారు.

    himanta-sarma



  • May 06, 2025 17:38 IST

    హైదరాబాద్‌‌లో యుద్ధానికి సిద్ధమవ్వండి.. ఈ ప్రాంతాలే టార్గెట్!

    కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం, హైదరాబాద్ సిటీల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేవాలు జారీ చేసింది. హైదరాబాద్‌లోని సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్‌బాగ్ DRDA, మౌలాలీ NFC ప్రాంతాల్లో సా. 4గంటలకు మాక్‌ డ్రిల్ చేయనున్నారు.

    hyd Mock drills 123



  • May 06, 2025 15:58 IST

    BIG BREAKING: ఉగ్రదాడి గురించి మోదీకి 3 రోజుల ముందే తెలుసు.. ఖర్గే సంచలన కామెంట్స్!

    కాంగ్రెస్ నేత ఖర్గే.. మోదీపై సంచలన ఆరోపణలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి గురించి ప్రధాని మోదీకి 3 రోజుల ముందే తెలుసన్నారు. అందుకే మోదీ తన కశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నారని చెప్పారు. ప్రజల రక్షణకోసం సరైన చర్యలు తీసుకోవట్లేదని విమర్శించారు. 

    అమిత్ షా లేఖకు ఖర్గే ఘాటు రిప్లై...!



  • May 06, 2025 15:40 IST

    Pakistan: యుద్ధానికి దిగితే పాకిస్తాన్ చిన్నాభిన్నం.. ఆ దేశం అప్పులెన్నో తెలుసా?

    పాక్ భారత్‌తో యుద్ధం విషయంలో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. దేశ ఆర్ధిక పరిస్ధితి అప్పుల్లో ఉంది. పాకిస్థాన్‌ అప్పులు పాక్‌ రూపాయల్లో 70.36 ట్రిలియన్లు (భారత కరెన్సీలో రూ.21.15 లక్షల కోట్లు). ఆ దేశ జీడీపీ గ్రోత్ రేట్ కూడా 2.38 శాతం మాత్రమే.

    pakistan economy



  • May 06, 2025 13:17 IST

    హైదరాబాద్, విశాఖతో పాటు.. ఏపీ, తెలంగాణలో మాక్ డ్రిల్స్ జరిగే ప్రాంతాలివే!

    మే 7న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌లు నిర్వహించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖలో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. కశ్మీర్‌, గుజరాత్, హరియాణా, అస్సాం రాష్ట్రాల్లో అత్యధిక చోట్ల డ్రిల్స్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు.

    drills defense
    drills defense

     



  • May 06, 2025 12:13 IST

    భారత్, పాక్ యుద్ధం డేట్ ఫిక్స్.. సంచలన ట్వీట్!

    పాక్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ చేసిన ఓ ట్విట్ ఇప్పుడు సంచలనం రేపుతోంది.  2025 మే 10 లేదా 11వ తేదీన పాక్‌పై భారత్ దాడి చేసే అవకాశం ఉందంటూ ఆయన తన ట్వీట్ లో తెలిపారు.  రష్యా విక్టరీ డే తర్వాత ఇండియా పాక్‌పై దాడి చేసే ఛాన్స్ ఉందన్నారు.

    india-vs-pak-war
    india-vs-pak-war

     



  • May 06, 2025 11:42 IST

    కేంద్ర ప్రభుత్వ బిగ్గెస్ట్ యాక్షన్ ప్లాన్.. దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్..

    పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య కేంద్రం కీలక ప్రకటన చేసింది. మే 7న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌లు నిర్వహించాలని చెప్పింది. అసలేంటీ మాక్ డ్రిల్? కేంద్రం ఎందుకు దీనిని నిర్వహించాలని చెప్పింది?

    india
    Mock Drill Black Out

     



  • May 06, 2025 11:40 IST

    పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ.. బిగ్ షాకిచ్చిన ఐదు దేశాలు!

    పాకిస్తాన్‌కు విదేశీ విమానయాన సంస్థలు బిగ్ షాక్ ఇస్తున్నాయి.  బ్రిటన్,ఫ్రాన్స్, ఒమన్‌ ఎయిర్ లైన్స్ వంటి సంస్థలు  పాక్‌ మీదుగా అంతర్జాతీయ విమానాలను నిలిపివేశాయి.  పాక్ గగనతలం మీదుగా విమానాలు వెళ్లకూడదని నిర్ణయం  తీసుకున్నాయి.

    Read More



  • May 06, 2025 10:32 IST

    పరువు పోయిందిగా.. పాకిస్తాన్కు అవమానం.. వెళ్లి మరి తన్నించుకున్నారు!

    భారత్ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందంటూ UNSCని పాక్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశంలో UNSC పాక్ పై ప్రశ్నల వర్షం కురిపించింది. పహాల్గాం ఉగ్రదాడిలో ప్రత్యేకంగా ఓ మతం పర్యాటకులనే కాల్చి చంపడంపై  ఐరాస అగ్రహం వ్యక్తం చేసింది.  

    Read More



  • May 06, 2025 10:14 IST

    పాక్తో వార్.. అన్ని రాష్ట్రాలకు కేంద్రం కీలక ప్రకటన!

    మే 7న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌లు నిర్వహించాలని హోం శాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. వైమానిక దాడులపై అవగాహాన కోసం మాక్ డ్రీల్ నిర్వహించాలని కేంద్రం సూచించింది.హోం శాఖ అదేశాలను బట్టి చూస్తే ఏ క్షణంలోనైనా పాక్ తో వార్ ఉండవచ్చునని తెలుస్తోంది. 

    Amit Shah
    Amit Shah

     



  • May 06, 2025 10:13 IST

    పాక్‌కు జపాన్ దిమ్మతిరిగే షాక్.. భారత్‌కు ఫుల్ సపోర్ట్

    యునైటెడ్ కింగ్‌డమ్, ఇటలీ నేతృత్వంలో యుద్ధ జెట్ కార్యక్రమం అయిన GCAPలో చేరడానికి జపాన్ భారతదేశంతో సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆరవ తరం యుద్ధ విమానాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను 2022లో ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాదికి పూర్తి అవుతుంది.

    Read More



  • May 06, 2025 08:20 IST

    భారత్, పాక్ ఉద్రిక్తతలు... ఐక్యరాజ్యసమితి కీలక ప్రకటన..

    పహల్గామ్ ఉగ్రదాడి ఘటనతో భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం రాజ్యమేలుతోంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే అణుదేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి స్పందించింది.

    United Nations
    United Nations

     



  • May 06, 2025 08:11 IST

    ఉగ్రవాదులకు సహాయం.. జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు అరెస్టు

    జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల సహాయకులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.  బుద్గాం జిల్లాలో ఉగ్రవాదులకు సాయం చేస్తున్నట్లుగా గుర్తించిన భద్రతా బలగాలు ఇద్దరిని చెక్‌పోస్టు వద్ద అరెస్ట్ చేశారు.  వారి వద్ద నుంచి గ్రనేడ్, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.



  • May 06, 2025 07:52 IST

    J&K: Visuals from Ramban



  • May 06, 2025 07:32 IST

    భారత్‌పై మొదటి బాంబు



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు