/rtv/media/media_files/2025/05/06/17WQzJkcxmPKV4rH5qL4.jpg)
india-vs-pak-war
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణమైనా ఇరు దేశాల మధ్య వార్ జరగవచ్చు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో పాక్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. 2025 మే 10 లేదా 11వ తేదీన పాక్పై భారత్ దాడి చేసే అవకాశం ఉందంటూ ఆయన తన ట్వీట్ లో తెలిపారు. రష్యా విక్టరీ డే తర్వాత ఇండియా పాక్పై దాడి చేసే ఛాన్స్ ఉందని ఆయన తన ట్వీట్ లో వెల్లడించారు. ఇప్పుడీ ట్వీట్ సంచలనంగా మారింది.
India will likely carry out its limited misadventure against Pakistan after Victory Celebrations in Russia. Perhaps on 10-11 May.
— Abdul Basit (@abasitpak1) May 6, 2025
మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ లతో పీఎం భేటీ అయ్యారు. సరిహద్దులో ఉద్రిక్తతలపై ఆయన చర్చిస్తున్నారు. ఏ క్షణమైనా పాక్ తో యుద్ధం జరగవచ్చునని చర్చ నడుస్తున్న వేళ ఈ భేటీ ప్రాధన్యతను సంతరించుకుంది.
ఐక్యరాజ్యసమితి కీలక ప్రకటన
భారత్-పాక్ ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితి కీలక ప్రకటన చేసింది. ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరడం బాధాకరమని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ వెల్లడించారు. రెండు దేశాలు సంయమనం పాటించాలని ఆయన కోరారు. పహల్గామ్ దాడి తర్వాత భావోద్వేగాలను తాము అర్థం చేసుకోగలమని, పొరపాట్లు చేయొద్దని..దీనికి సైనిక చర్య పరిష్కారం కాదని తెలిపారు. ఉద్రిక్తతలు నివారించే ఏ చర్యకైనా తాము సహకరిస్తామని చెప్పుకొచ్చారు. పహల్గామ్ దాడిని తాను మరోసారి తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పిన ఆయన బాధితుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. నిందితులను చట్టం ముందు నిలబెట్టాలని అన్నారు.