/rtv/media/media_files/B9Ee94p9I3BcH8Xpm0md.jpg)
తెలంగాణలో నివాసముంటున్న పాకిస్తానీలను గుర్తించి, వెనక్కి పంపించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కే.లక్ష్మణ్ నేతృత్వంలో పలువురు నేతలు గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో అక్రమంగా నివాసం ఉంటున్న పాకిస్తానీలను రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలన్నారు. అలాంటి వారిని వెంటనే వారి దేశం పంపించివేయాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఈ పని ఇప్పటికే చేస్తున్నారన్నారు.
తెలంగాణలో నివాసముంటున్న పాకిస్తానీలను గుర్తించి, వెనక్కి పంపించాలి!
— BJP Telangana (@BJP4Telangana) May 6, 2025
రాజ్యసభ సభ్యులు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా.@drlaxmanbjp గారి నేతృత్వంలో గవర్నర్ గారిని కలిసిన తెలంగాణ బిజెపి నేతలు.. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని, ఇతర రాష్ట్రాలలో ఎలాగైతే పాకిస్తానీలను తమ… pic.twitter.com/pJQeBKsXow
వెనక్కి పంపించండి..
పహల్గామ్ ఉగ్రదాడికి పాకిస్తాన్ మద్దతు ఉందన్న విషయాన్ని ఇప్పటికే ఇంటెలిజెన్స్ సంస్థలు గుర్తించాయన్నారు. ఈ నేపథ్యంలో దేశ భద్రతకి ప్రమాదం కలిగించే వారిని తక్షణమే వెనక్కి పంపాల్సిన అవసరం ఉందని గవర్నర్ కు అందించిన వినతి పత్రంలో పేర్కొన్నారు. గవర్నర్ను కలిసిన వారిలో తెలంగాణ బీజేపీ ఉపాధ్యక్షుడు విజయ రామారావు, చింతల రామచంద్రా రెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, యెండల లక్ష్మీనారాయణ, ఎన్.వీ.ఎస్.ఎస్ ప్రభాకర్, తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, కుమారి బంగారు శృతి, డా. కాసం వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
(pahalgam terror attack | telugu-news | telugu breaking news )