Pakistan : పరువు పోయిందిగా..  పాకిస్తాన్కు అవమానం.. వెళ్లి మరి తన్నించుకున్నారు!

భారత్ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందంటూ UNSCని పాక్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశంలో UNSC పాక్ పై ప్రశ్నల వర్షం కురిపించింది. పహాల్గాం ఉగ్రదాడిలో ప్రత్యేకంగా ఓ మతం పర్యాటకులనే కాల్చి చంపడంపై  ఐరాస అగ్రహం వ్యక్తం చేసింది.  

New Update

భారత్ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందంటూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC)ని పాక్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. భద్రతా మండలిలో భారత్ చర్యలను పాక్ తప్పుబట్టే ప్రయత్నం చేసింది.  పహాల్గాం ఉగ్రదాడి ప్రస్తావన తేకుండా భారత్ చర్యలపైనే పాక్ ఫోకస్ చేసింది.  సింధూ నదిజలాల  ఒప్పందాన్ని రద్దు చేయడాన్ని ఈ సమావేశంలో పాక్ ప్రస్తావించింది. పాకిస్థాన్‌ చెప్పిన పలు అంశాలను సభ్య దేశాలు తిరస్కరించాయి. సమస్యను భారత్‌తో ద్వైపాక్షిక చర్చలతో పరిష్కరించుకోవాలని సూచించాయి.   

ప్రశ్నల వర్షం

అయితే ఈ సమావేశంలో UNSC పాక్ పై ప్రశ్నల వర్షం కురిపించింది. పహాల్గాం ఉగ్రదాడిలో ప్రత్యేకంగా ఓ మతం పర్యాటకులనే కాల్చి చంపడంపై  ఐరాస అగ్రహం వ్యక్తం చేసింది.  దీని వెనుక లష్కరే తొయిబా ప్రమేయం ఉందా అంటూ పాక్ ను నిలదీసింది.  పాక్ జరుపుతోన్న క్షిపిణి పరీక్షలపై ఐరాస భద్రతామండలి ఆందోళన వ్యక్తం చేసింది.  క్షిపణి ప్రయోగాలు, న్యూక్లియర్ దాడులు చేస్తామని ప్రకటించడాన్ని తప్పుబట్టింది. 

భారత్ తో  చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పాక్ కు  సూచించింది. టెర్రర్ అటాక్, మతాన్ని బట్టి టూరిస్టులను టార్గెట్ చేయడాన్ని UNSC తీవ్రంగా  ఖండించింది. మతం గురించి అడిగిన తర్వాత ఉగ్రవాదులు కాల్పులు జరిపారనే అంశాన్ని UNSC లేవనెత్తింది. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) రహస్య సమావేశాన్ని నిర్వహించగా..  భద్రతామండలిలో తాత్కాలిక సభ్య దేశంగా పాక్ ఉంది.  అయితే ఎలాంటి తీర్మానం లేకుండానే భద్రతా మండలి రహస్య సమావేశం ముగిసింది.  

 ఐక్యరాజ్యసమితి కీలక ప్రకటన

భారత్-పాక్ ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితి కీలక ప్రకటన చేసింది.  ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరడం బాధాకరమని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ వెల్లడించారు.  రెండు దేశాలు సంయమనం పాటించాలని ఆయన కోరారు. పహల్గామ్ దాడి తర్వాత భావోద్వేగాలను తాము అర్థం చేసుకోగలమని, పొరపాట్లు చేయొద్దని..దీనికి సైనిక చర్య పరిష్కారం కాదని తెలిపారు.  ఉద్రిక్తతలు నివారించే ఏ చర్యకైనా తాము సహకరిస్తామని చెప్పుకొచ్చారు. పహల్గామ్ దాడిని తాను మరోసారి తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పిన ఆయన బాధితుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.  నిందితులను చట్టం ముందు నిలబెట్టాలని అన్నారు.

Also read :  Hacking: భారత రక్షణశాఖ వెబ్ సైట్లపై పాకిస్థానీ హ్యాకర్ల దాడి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు