New Update
/rtv/media/media_files/2025/05/06/h4kfLuOLmnpSV0dr6XyN.jpg)
పాకిస్తాన్తో మనకున్న సంబంధాలు రోజురోజుకు దెబ్బతింటున్నాయి. రెండు దేశాలు యుద్ధానికే సిద్ధమవుతున్నాయి. ఆర్మీతోపాటు న్యూక్లియర్ ఆయుధాలు, క్షిపణులు, ఎయర్ ఫోర్స్, నేవీ రెండు దేశాల దగ్గర ఉన్నాయి. వార్ వస్తే మిలటరీ స్ట్రాటజీ ఎలా ఉంటుంది..? ఎవరి దగ్గర ఎన్ని కిలో మీటర్ల టార్గెట్ను రీచ్ అయ్యే క్షిపణులు ఉన్నాయి? పాకిస్తాన్కు ఇండియాలో ఏ ఏ నగరాల మీద కన్ను ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
శత్రు దేశం మన మీద అణ్వాయుధాలతో దాడి చేస్తేనే ఇండియా తిరిగి న్యూక్లియర్ అటాక్ చేస్తోంది. అదే ఇండియా న్యూక్లియర్ పాలసీ. పాకిస్తాన్ మాత్రం అలా కాదు. తమ సైన్యానికి, సార్వభౌమాధికారానికి భంగం వాటిల్లతుందని, నష్టం జరుగుతుందని భావిస్తే అణ్వాయుధాలు ప్రయోగిస్తోంది. అయితే పాకిస్తాన్, భారత్ దేశాల మధ్య యుద్ధం వస్తే మొదటగా న్యూక్లియర్ దాడి చేసే అవకాశం పాకిస్తాన్కే ఉంది. ఇండియా సిద్దాంతాలనికి కట్టుబడి మొదటగా అణు బాంబులతో దాడి చేయదు.
ఇకపోతే ఇండియాలో పాక్ ఏ ఏ ప్రాంతాలను టార్గెట్గా చేసుకుంటుందంటే.. మొదటి స్థానంలో ఇండియా ఎకనమిక్ క్యాపిటల్ ముంబై ఉంది. తర్వాత ప్లేస్లో హైదరాబాద్ ఉంది. ఇండియా పౌరులను లక్ష్యంగా చేసుకొని శత్రు దేశం దాడులు చేయదు. అలా చేస్తే ఐక్యరాజ్య సమితి, ప్రపంచ దేశాల నుంచి పాక్పై వ్యతిరేకత వస్తోంది. సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకొని ఆర్మీ అటాక్ చేస్తోంది. యుద్ధం ఇరుదేశాల సైన్యాల మధ్యనే జరగాలి కాబట్టి. ఆర్మీకి ఆయుధాల సప్లై చేసే సంస్థలు, నిత్యవసర వస్తువుల సరఫరాలపై పాకిస్తాన్ గురిపెట్టే అవకాశాలు ఎక్కువ. ఆర్థికంగా దెబ్బకొట్టాలంటే ముంబై, సైన్యంపై దాడి చేయాలంటే హైదరాబాద్, ఇండియన్ అడ్మినిష్ట్రేషన్కు భంగం కల్పించాలంటే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పాకిస్తాన్ దాడులకు తెగబడుతుంది.
కారణాలు..
మనం అయినా, పాకిస్తాన్ అయినా యుద్ధంలోకి దిగితే తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టాన్ని కలిగించాలని అనుకుంటాం. అణ్వాయుధాలు నిర్వహణ ఖర్చు చాలా ఎక్కువ. అయితే అవి ప్రయోగించాలంటే ఏ దేశమైనా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తోంది. ఆస్తి, ప్రాణ నష్టం ఎక్కువగా జరిగే ప్రాంతాల్లోనే దాడికి మొదటి ప్రాధాన్యత ఇస్తాయి. అలా చూసుకుంటే జనసాంద్రత ఎక్కువున్న, అభివృద్ధి చెందుతున్న నగరాలే పాకిస్తాన్ టార్గెట్ లిస్ట్లో ఉంటాయి. వాటిల్లో హైదరాబాద్, ముంబై, బెంగుళూర్, ఢిల్లీ, చెన్నై కీలకంగా ఉన్నాయి. హైదరాబాద్లో ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఉన్నాయి. రక్షణ రంగ సంస్థలు కూడా ఇక్కడే ఉన్నాయి. గతంలో కూడా ఉగ్రవాదులు హైదరాబాద్లో బ్లాస్ట్లు జరిపారు. ఆర్మీకి క్షిపణులు అందించే DRDA ఇక్కడే ఉంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్, గోల్కొండ ఆర్మీ రిజమెంట్లు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న బీడీఎల్, డీఆర్డీఓ, మిథాని, హెచ్ఏఎల్ వంటి సంస్థలు దేశ రక్షణ కోసం రాకెట్లు, మిస్సైల్స్ తదితర ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లాంటి కీలక ప్రాంతాలు తెలంగాణ రాజధానిలోనే ఉన్నాయి. దేశ రక్షణ రంగానికి హైదరాబాద్తో పాటు బెంగళూరు ముఖ్య కేంద్రాలుగా ఉన్నాయి.
పాకిస్తాన్ షాహీన్ - III 2,750 కి.మీ వరకు లక్ష్యాలను చేరుకోగల మధ్యస్థ-శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. పాకిస్తాన్ దీన్ని ఉపయోగించి ఏ రాష్ట్రంపై అయినా దాడి చేయగలదు. ఇండియాలో పెద్ద పెద్ద నగరాలు అన్నీ ఈ క్షిపణి రేంజ్ పరిధిలోనే ఉన్నాయి. అలాగే పాకిస్తాన్ 2,200 కి.మీ రేంజ్ సామర్ధ్యం ఉన్న అబాబీల్ మిస్సేల్ను 2017లో పరీక్షించారు. ఇది ఒకే సారి బహుల లక్ష్యాలను చేధిస్తుంది. వ్యూహాత్మక సామర్థ్యాలను మెరుగుపరిచే MIRVలను మోసుకెళ్లడానికి రూపొందించబడింది.
ఇండియాలో ఖండాంతర క్షిపణులు(ICBM) కూడా ఉన్నాయి. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) నేతృత్వంలోని భారతదేశ క్షిపణి కార్యక్రమంలో అగ్ని శ్రేణి కూడా ఉంది. అగ్ని-V అనేది దాదాపు 7,000 నుంచి 8,000 కి.మీ పరిధి కలిగిన ఒక ICBM. ఇది అణు వార్హెడ్లను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంటుంది. MIRV సాంకేతికతతో అమర్చబడి ఉంటుంది. అగ్ని-VI ప్రస్తుతం అభివృద్ధిలో ఉంది. ఈ క్షిపణి 10,000 కి.మీ కంటే ఎక్కువ పరిధిని కలిగి ఉంటుందని మరియు MIRV సామర్థ్యాలను కూడా కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
(pakistan | indo pak war | india | hyderabad | ballistic missile attack | big-missile-attack | latest-telugu-news)
తాజా కథనాలు