BIG BREAKING: పాక్‌కు జపాన్ దిమ్మతిరిగే షాక్.. భారత్‌కు ఫుల్ సపోర్ట్

యునైటెడ్ కింగ్‌డమ్, ఇటలీ నేతృత్వంలో యుద్ధ జెట్ కార్యక్రమం అయిన GCAPలో చేరడానికి జపాన్ భారతదేశంతో సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆరవ తరం యుద్ధ విమానాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను 2022లో ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాదికి పూర్తి అవుతుంది.

New Update
Japan Flight jet

Japan Flight jet

భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని దేశాలు పాక్‌కు సపోర్ట్ ఇవ్వగా.. మరికొన్ని ఇండియాకు సపోర్ట్ ఇస్తున్నాయి. అయితే జపాన్ దేశం భారత్‌కు సపోర్ట్ చేస్తోంది. యునైటెడ్ కింగ్‌డమ్, ఇటలీ నేతృత్వంలో యుద్ధ జెట్ కార్యక్రమం అయిన గ్లోబల్ కాంబాట్ ఎయిర్ ప్రోగ్రామ్ (GCAP)లో చేరడానికి జపాన్ భారతదేశంతో సంప్రదించినట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: Trump effect on Tollywood: తెలుగు సినిమాకు ట్రంప్ దెబ్బ.. 7 వేలు దాటనున్న టికెట్ ధరలు!

ఇది కూడా చూడండి: Indo-Pak tension: పాకిస్థాన్‌పై దాడి లాంఛనమే.. IAF చీఫ్‌తో ప్రధాని మోదీ

ఖర్చులను తగ్గించుకోవడమే కాకుండా..

ఆరవ తరం యుద్ధ విమానాలను అభివృద్ధి చేయడమే ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు తెలుస్తోంది. ఖర్చులను తగ్గించుకోవడమే కాకుండా, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వాన్ని పెంపొందించడంలో జపాన్ భావిస్తోంది. గతేడాది జపాన్, యూకే, ఇటలీ నాయకులు సమావేశమై, GCAP (గ్లోబల్ కంబాట్ ఎయిర్ ప్రోగ్రామ్) ను విస్తరించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇందులో మరికొన్ని దేశాలను చేర్చాలను భావిస్తున్నారు. ఆరవ తరం యుద్ధ విమానాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ 2022లో ప్రారంభించారు.

ఇది కూడా చూడండి: VIRAL VIDEO: వెడ్డింగ్ షూట్‌లో విషాదం.. వధువుపై పేలిన బాంబు.. వీడియో వైరల్

ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, జపాన్ ప్రధాన మంత్రి షిగెరు ఇషిబా, బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తమ ప్రస్తుత భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం ద్వారా GCAP కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాదికి పూర్తి అవుతుందని భావిస్తున్నారు. జపాన్‌కు చెందిన మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్, ఇటలీకి చెందిన లియోనార్డో, యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన బిఎఇ సిస్టమ్స్ ఈ ప్రాజెక్టుకు సిస్టమ్ ఇంటిగ్రేటర్లుగా నాయకత్వం వహిస్తున్నాయి. అయితే అధునాతన ఫైటర్ జెట్‌ను అభివృద్ధి చేయడం చాలా సవాలుతో కూడుకున్నది. దీనికి భారీ ఆర్థిక పెట్టుబడి కూడా అవసరం. అయితే ఇది ఈ మూడు దేశాలకు కష్టమని తెలుస్తోంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు