BIG BREAKING: ఉగ్రదాడి గురించి మోదీకి 3 రోజుల ముందే తెలుసు.. ఖర్గే సంచలన కామెంట్స్!

కాంగ్రెస్ నేత ఖర్గే.. మోదీపై సంచలన ఆరోపణలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి గురించి ప్రధాని మోదీకి 3 రోజుల ముందే తెలుసన్నారు. అందుకే మోదీ తన కశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నారని చెప్పారు. ప్రజల రక్షణకోసం సరైన చర్యలు తీసుకోవట్లేదని విమర్శించారు. 

New Update
Mallikarjun Kharge : మేము అధికారంలోకి వస్తే ఒక్కరే ప్రధాని.. మోదీ వ్యాఖ్యలకు ఖర్గే కౌంటర్

Congress leader Kharge ensational allegations against Modi

BIG BREAKING: కాంగ్రెస్ నేత ఖర్గే.. మోదీపై సంచలన ఆరోపణలు చేశారు. ఉగ్రదాడి గురించి ప్రధాని మోదీకి 3 రోజుల ముందే తెలుసన్నారు. అందుకే మోదీ తన కశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నారని చెప్పారు. ప్రజల రక్షణకోసం సరైన చర్యలు తీసుకోవట్లేదన్నారు.  ఈ మేరకు నిఘా సమాచారం బలంగా ఉన్నప్పటికీ, ప్రజలను రక్షించడానికి ఎందుకు ఎలాంటి చర్య తీసుకోలేదని ఖర్గే ప్రశ్నించారు. ఇది పొరపాటా లేదా ప్రణాళికాబద్ధంగానే జరిగిందా? అంటూ అనుమానం వ్యక్తం చేశారు. 

మోదీకి తెలిసినా చెప్పలేదు..

అయితే జమ్మూకశ్మీర్‎ కాత్రా నుంచి శ్రీనగర్‌ మధ్య నడిచే రైలు సర్వీసును మోదీ ప్రారంభించాల్సి ఉంది. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా ఏప్రిల్ 19న జరగాల్సిన పర్యటన వాయిదా పడింది. మోదీ టూర్ క్యాన్సిల్ అయిన 3 రోజులకే పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. ఈ నేపథ్యంలో మోదీపై ఖర్గే ఆరోపణలు చేశారు. ప్రస్తుతం జార్ఖండ్‎లో పర్యటిస్తున్న ఖర్గే.. పహల్గాం ఉగ్రదాడి జరగడానికి 3 రోజుల ముందే ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు మోదీకి సమాచారం ఇచ్చాయి. ఇంటలిజెన్స్ సూచనతోనే మోదీ పర్యటన క్యాన్సిల్ చేసుకున్నారని విమర్శలు గుప్పించారు. 

ఇది కూడా చదవండి: తల నరికి.. బీజేపీ మహిళా నేత దారుణ హత్య!

ఉగ్రదాడిలో ఇంటెలిజెన్స్ నిర్లక్ష్యం ఉంది. అఖిలపక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. ఈ దాడికి 3 రోజుల ముందే జమ్మూలో టెర్రర్ ఎటాక్ జరగొచ్చని ప్రధానికి ఇంటెలిజెన్స్ నివేదిక పంపించినట్లు నాకు సమాచారం అందింది. ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని తెలియగానే ప్రభుత్వం ఎందుకు అలర్ట్ చేయలేదని మండిపడ్డారు. 

ఇది కూడా చదవండి: ఆ వ్యాధులు ఉన్నవారు పుచ్చకాయ తింటే డేంజర్.. ఈ విషయాలు మీకు తెలుసా?

kharge | modi | pehalgam attack | telugu-news | today telugu news  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు