Pahalgam Terror Attack : భారత్, పాక్ ఉద్రిక్తతలు... ఐక్యరాజ్యసమితి కీలక ప్రకటన..

పహల్గామ్ ఉగ్రదాడి ఘటనతో భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం రాజ్యమేలుతోంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే అణుదేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి స్పందించింది.

New Update
United Nations

United Nations

పహల్గామ్ ఉగ్రదాడి ఘటనతో భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం రాజ్యమేలుతోంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. పహల్గామ్‌లో టూరిస్టులపై దాడి చేసి అమాయకులను చంపడాన్ని ప్రపంచమంతా తప్పుపట్టింది.  అయితే అణుదేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి స్పందించింది.

Also read :  Miss World Competition : మిస్‌ వరల్డ్‌ పోటీలు..మన దేశం నుంచి పాల్గొనే అందాల భామ ఎవరంటే?

Pahalgam Terror Attack

ఈపరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితి కీలక ప్రకటన చేసింది. న్యూయార్క్ లోని ఐరాస కార్యాలయంలో ఆ సంస్థ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ మాట్లాడారు.ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొన్నేళ్లుగా ఎన్నడూ లేనంతగా తీవ్ర స్థాయికి చేరడం బాధాకరమని ఆయన అన్నారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఇరు దేశాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Also Read :  TGSRTC : ఆర్టీసీ సమ్మె... ఉద్యోగులను బెదిరిస్తే..అంతే సంగతులు సిబ్బందికి యాజమాన్యం బహిరంగ లేఖ...

పౌరులను లక్ష్యంగా చేసుకోవడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఈ కీలక సమయంలో సైనిక ఘర్షణ నివారించడం ముఖ్యమని పేర్కొన్నారు. వీలైనంత ఎక్కువగా సంయమనం పాటించాల్సిన సమయం ఇదేనని ఆయన అన్నారు.

ఉగ్రదాడి తర్వాత ప్రజల్లో భావోద్వేగాలను తాను అర్ధం చేసుకోగలనని, ఇందుకు సైనిక చర్య మాత్రం పరిష్కారం కాదన్నారు. పొరపాట్లు చేయవద్దని, సంయమనం పాటించాలని ఇరు దేశాలకు ఆయన హితవు పలికారు. ఉద్రిక్తతలు తగ్గించే దౌత్యాన్ని, శాంతిని పునరుద్ధరించేందుకు అవసరమైన ఏ చర్యకైనా మద్దతు ఇచ్చేందుకు ఐరాస సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను నివారించే చర్యలకు సహకరిస్తామని ఐరాస ప్రకటించింది.

Also read :  సుజనా చౌదరికి తీవ్ర గాయం..హైదరాబాద్కు తరలింపు!

Also Read :  కేంద్ర ప్రభుత్వ బిగ్గెస్ట్ యాక్షన్ ప్లాన్.. దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్..

 

united-nations | Pahalgam Attack latest news | india on pahalgam attack | attack in Pahalgam

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు