Weather Update: ముంచుకొస్తున్న వాయుగుండం.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల ఏపీతో పాటు తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ వాయుగుండం వల్ల శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.