Srikakulam : బయటకు వెళ్తే చంపేస్తారని.. రెండేళ్లుగా కూతురిని బంధించిన తల్లి!
ఒడిశాలోని కటక్కు చెందిన నరసింహరాజుతో భాగ్యలక్ష్మికి 2007లో వివాహమైంది. పదేళ్ల క్రితం భర్త మరణించడంతో, కుమార్తె మౌనికతో కలిసి భాగ్యలక్ష్మి తన కన్నవారి ఇంటి వద్దే ఉంటుంది.
ఒడిశాలోని కటక్కు చెందిన నరసింహరాజుతో భాగ్యలక్ష్మికి 2007లో వివాహమైంది. పదేళ్ల క్రితం భర్త మరణించడంతో, కుమార్తె మౌనికతో కలిసి భాగ్యలక్ష్మి తన కన్నవారి ఇంటి వద్దే ఉంటుంది.
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఆ ఉపాధ్యాయురాలు వారితో కాళ్ళు నొక్కించుకుంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగుచూసింది. ఉపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసులు ఇచ్చి.. విచారణకు ఆదేశించారు.
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఆలయంలో తొక్కిసలాటకు దారి తీసిన అంశాలపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ముగ్గురు సభ్యులతో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు.
ఇటీవల తమిళనాడులో నటుడు విజయ్ ర్యాలీలో ఘోరమైన తొక్కిసలాట ఘటన జరిగింది. ఇందులో దాదాపు 41 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మరువక ముందే ఇప్పుడు మరొక తొక్కిసలాట ఘటన ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది.
కార్తీక మాసం తొలి ఏకాదశి నాడు గోవిందా నామస్మరణలతో మారుమోగాల్సిన ఆలయం భక్తుల ఆర్తనాదాలతో హోరెత్తింది! ఈరోజు శ్రీకాకుళం పలాస జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామీ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో నవంబర్ 1వ తేదీన(ఇవాళ) ఘోర విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగి 10 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. ఘటనలో గాయపడ్డ మహిళలు, పిల్లలు రోదిస్తున్న తీరు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.
ఏకాదశి రోజున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తొక్కిసలాట జరిగి దాదాపు 9 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఈ ఘటన తనను కలచివేసిందన్నారు.
మొంథా తుపాను ప్రభావం ఏపీపై భారీగా పడింది. తుపాను వల్ల ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో పంట పొలాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో పలు జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.