/rtv/media/media_files/2025/11/01/fotojet-2025-11-01t134622339-2025-11-01-13-46-54.jpg)
Srikakulam Venkateswara Swamy Temple Stampede
Kashibugga : ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో నవంబర్ 1వ తేదీన(ఇవాళ) ఘోర విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగి 10 మంది మరణించారు(మృతుల సంఖ్య పెరగొచ్చని చెబుతున్నారు). ఏకాదశి కావడంతో భక్తులు భారీగా రావడంతో ఇది చోటు చేసుకుంది. ఉత్తరాంధ్ర చిన్నతిరుపతిగా పేరున్న ఈ ఆలయంలో.. ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయకపోవడమే ఈ విషాదానికి కారణమని తెలుస్తోంది. కాగా తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారు. వారి ఆర్తనాదాలతో దేవాలయ ప్రాంగణం మరుభూమిగా మారిపోయింది. అక్కడి దృశ్యాలు ప్రతి ఒక్కరిచి కలచివేస్తున్నాయి. మహిళలు, పిల్లలు రోదిస్తున్న తీరు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.
రాష్ట్రంలో మరో ఘోర విషాదం
— M.INDRASENAREDDY (@indrasena9966) November 1, 2025
శ్రీకాకుళం కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట… 9 మంది దుర్మరణం
కార్తీక మాసం ఏకాదశి కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం...#IndraSenaReddy#NewsUpdatepic.twitter.com/D439afRker
శ్రీకాకుళంలో విషాదం
— greatandhra (@greatandhranews) November 1, 2025
కొడుకు కళ్ళ ముందే చనిపోవడంతో 'నాన్నా లేవరా అంటూ' తల్లి గుండెలు పగిలేలాగా రోదిస్తుంది.
కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి ఇప్పటివరకు 9 మంది మృతి చెందారు. pic.twitter.com/JMrJUloMiI
బ్రేకింగ్ న్యూస్
— Telugu Scribe (@TeluguScribe) November 1, 2025
ఏపీలో తీవ్ర విషాదం
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట
తొక్కిసలాటలో 9 మంది మృతి, పలువురికి గాయాలు pic.twitter.com/CmQ2nxtGvN
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట
— NageshT (@NageshT93116498) November 1, 2025
తొక్కిసలాటలో 7 మంది మృతి, పలువురికి గాయాలు
దేవాలయ సామర్థ్యం 2-3 వేల మంది కాగా, ఏకాదశి సందర్భంగా 25 వేల మందికి పైగా భక్తులు రావడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని చెబుతున్న ఆలయ సిబ్బంది@
సెన్సిటివ్ వీడియోలు pic.twitter.com/npW8WN1wBf
కాశీబుగ్గ వేంకటేశ్వరాలయం తొక్కిసలాటతో బాధితుల ఆర్తనాదాలతో ఆలయ పరిసరాల్లో విషాదం.#AndhraPradesh#srikakulam#stampade#mother#son#Incident#RTVpic.twitter.com/hFj8j9xhy5
— RTV (@RTVnewsnetwork) November 1, 2025
Follow Us