AP Weather: ఏపీలో మండుతున్న ఎండలు.. ఈ జిల్లాల్లో జాగ్రత్త
ఏపీలో ఎండల తీవ్రత కనిపిస్తోంది.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలతో పాటుగా వేడిగాలుల దెబ్బకు జనాలు అల్లాడిపోతున్నారు. సోమవారం కూడా రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఏపీలో ఎండల తీవ్రత కనిపిస్తోంది.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలతో పాటుగా వేడిగాలుల దెబ్బకు జనాలు అల్లాడిపోతున్నారు. సోమవారం కూడా రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఏలూరులో ఆశ్రమం హాస్పిటల్ సమీపంలో ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 30 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తీవ్ర జ్వరంతో అసెంబ్లీకి వచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడికి నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాగే సభకు వస్తే సభ నుండి సస్పెండ్ చేసి పంపిస్తాం అంటూ నవ్వుతూ చెప్పారు. రెస్ట్ తీసుకోకోకుంటే.. యాపిల్ వాచ్ కొనిచ్చి మీ హెల్త్ ను మానిటర్ చేస్తానంటూ వ్యాఖ్యానించారు.
పశ్చిమగోదావరి జిల్లాఅత్తిలి మండలం దంతుపల్లి గ్రామంలో వీరాంజనేయులు(35), కడలి వెంకటనారాయణ మద్యం తాగిన సమయంలో పాత గొడవ పడ్డారు. మాట మాట పెరిగి వీరాంజనేయులు తలపై రాయితో వెంకటనారాయణ కొట్టాడు. వీరాంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం భారీ విజయం సాధించారు. 2 రౌండ్ల ముందుగానే ప్రధమ ప్రాధాన్యతా ఓటుతో ఆయన గెలుపు ఖరారైంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సోమవారం 8 గంటలకు ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 6 MLC స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగ్గా.. ఈరోజు కౌంటింగ్ చేస్తున్నారు.
మహాశివరాత్రి పర్వదినాన రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో తీవ్ర విషాదాలు చోటుచేసుకున్నాయి. నదిలో స్నానాలకు వెళ్లి తూర్పుగోదావరి, ఏలూరు, నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన దాదాపు 10 మంది మృతి చెందారు. వారి మృతితో ఆయా గ్రామాల్లో విషాధ ఛాయలు అలముకున్నాయి.
జనసేన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నాయకర్ను కుటుంబ సభ్యులు భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. టైఫాయిడ్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తున్నారు.
ఏపీలో బర్డ్ ప్లూ విజృంభిస్తోంది. గోదావరి జిల్లాలో లక్షల్లో ఫారం కోళ్లు చనిపోగా తాజాగా నాటుకోళ్లకు వ్యాధి సోకుతోంది. పందెం పుంజులు సైతం పిట్టల్లా రాలిపోతున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం వ్యాక్సిన్ పంపిణీ చేయాలని కోరుతున్నారు.