/rtv/media/media_files/2025/04/29/RbRq9S7qK2Wm6EUzg2eS.jpg)
pet dog lost today
పెట్ డాగ్స్ అంటే అందరికీ ఇష్టమే. కొందరైతే వాటితోనే రోజంతా గడుపుతారు. ఎలాంటి కక్ష, స్వార్థం, ద్రోహం తెలియని డాగ్స్తో జాలీగా ఎంజాయ్ చేస్తుంటారు. ఎల్లప్పుడు అవి ప్రేమను కలిగి ఉంటాయి. తమ యజమానులపై గొప్ప విశ్వాసంతో మెలుగుతాయి. ఎలాంటి ఆపద వచ్చినా.. రక్షించేందుకు ముందుంటాయి. వాటిని ఎంత ముద్దుగా చూసుకుంటే.. అవి కూడా అంతే ముద్దుగా ఇంట్లో వాళ్లతో కలిసిపోతుంటాయి.
Also Read: పాక్ జర్నలిస్టులకు షాక్ ఇచ్చిన భారత్.. కేంద్రం సంచలన నిర్ణయం
నిత్యం ఇంట్లో అటు ఇటు తిరుగుతూ సందడి సందడి చేస్తుంటాయి. అంతేకాకుండా ఒంటరిగా ఫీలవుతున్న వారు.. ఎక్కువగా పెట్ డాగ్లతో గడుపుతుంటారు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ పెట్ డాగ్ కనిపించకుండా పోతే.. ఆ బాధ ఎలా ఉంటుందో వర్ణించడం చాలా కష్టం. అది కనిపించేంత వరకు చుక్క నీరు కూడా తాగరు. కొందరైతే బోజనం కూడా చేయరు.
Also Read: హర్యానాలో ఐస్ క్రీంలు అమ్ముకుంటున్న పాక్ ఎంపీ.. ఆయన కన్నీటి కథ ఇదే!
తప్పిపోయిన డాగ్
తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఎంతో ప్రేమగా పెంచుకున్న తన డాగ్ కనిపించకుండా పోవడంతో ఓ యువకుడు ఆవేదనకు గురయ్యాడు. చాలా రోజులు వెతికినా కనిపించకపోవడంతో ప్రతి చోట పోస్టర్లు అంటించాడు. అందులో తన డాగ్ పేరు, తన ఊరు, రూ.10 వేల బహుమతి, ఫోన్ నెంబర్ పొందుపరిచాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also read : Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్
పట్టిస్తే రూ.10 వేలు
ఏలూరు జిల్లా, నూజివీడు మండలంలోని రామన్న గూడెం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పెట్ డాగ్ పెంచుకున్నాడు. ఒక రోజు అది కనిపించకుండా పోయింది. దీంతో తీవ్ర ఆవేదన చెందిన అతడు ఒక నిర్ణయానికి వచ్చాడు. పోస్టర్లపై అన్ని వివరాలతో రోడ్ల పక్కన గోడలపై అంటించాడు. డాగ్ పేరు నియో అని తెలిపాడు. రామన్న గూడెం గ్రామంలో ఆ డాగ్ తప్పిపోయిందని.. దాని ఆచూకీ తెలిపిన వారికి రూ.10వేల బహుమతి ఇస్తానని రాసుకొచ్చాడు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
dog | latest-telugu-news | telugu-news | viral-news