/rtv/media/media_files/2025/03/02/2qUAv0HSY4ch8XEvROK7.jpg)
Raghu Rama Krishna Raju
ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్వహిస్తోన్న సుపరిపాలన తొలి అడుగు సభలో ప్రోటోకాల్ పాటించడం లేదని దీనిపై సీఎస్కు లేఖరాస్తానని డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే రఘరామ సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రోటోకాల్ లో కలెక్టర్ కన్నా ఎమ్మెల్యే నే ఎక్కువ అన్న ఆయన కార్పొరేషన్ డైరెక్టర్ లు వంటి వారితో ఎమ్మెల్యే లను కూర్చోబెట్టడం ఎమ్మెల్యే లకు అవమానంగా భావిస్తున్నామన్నారు.ఇలాంటి సమావేశం జరిగే టప్పుడు ప్రోటోకాల్ తప్పక పాటించాలరని ఆమర సూచించారు. సరిగా ప్రోటోకాల్ పాటించక పోవడం పై ఎమ్మెల్యే లు అవమానంగా భావిస్తున్నారన్నారు.ఈ అంశంలో ఎమ్మెల్యే లు నాతో మాట్లాడారూ అందుకే నేను మాట్లాడాను అని రఘురామకృష్ణం రాజు అన్నారు. నా కన్నా కింద ప్రోటోకాల్ ఉన్న వారిని ముందు కూర్చోబెట్టితే నేను అవమానంగా భావిస్తానని ఆయన స్పష్టం చేశారు.
Also Read : ఏడు రోజులు వరుసగా పచ్చి ఏలకులు తింటే ఏమవుతోందో తెలుసా?
Also Read: అంతరిక్షంలో ఆరోగ్యం బాగోలేదన్న ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాన్షు శుక్లా
Raghu Rama Krishna Raju Creates Sensation
ఇంకా ఆయన మాట్లాడుతూ పిటిషన్ కమిటీ లో వచ్చే ఫిర్యాదుల్లో సైబర్ క్రైమ్ లు బాగా పెరిగి పోతున్నా్యన్నారు. తెలంగాణ లో 960 మంది బాధితులు ఉన్నారన్నారు. భీమవరం నుంచి పిల్లలు, మహిళలు కూడా బెట్టింగ్ యాప్ లు బారిన పడుతున్నారని పిటిషన్ కమిటీకి ఫిర్యాదులు అందాయన్నారు.లోన్ యాప్ టచ్ అయితే 10 వేలు అకౌంట్ లో పడి తర్వాత 20,000 కట్టాలి అని డిమాండ్ చేస్తున్నారన్నారు. స్కిల్ గేమ్ ల విషయం లో ఒక కమిటీ వేశారని రఘరామకృష్ణం రాజు తెలిపారు.మీడియా ద్వారా సైబర్ క్రైమ్ లకు వ్యతిరేకంగా సినిమా నటులు తో ప్రచారం చేయాలని సూచించారు.
Also Read: ట్రంప్ ఎవడికీ అర్థం కాడు.. ఇరాన్పై ముందు బాంబులు, ఇప్పుడు ప్రశంసలు
Also Read : గాంధీభవన్లో తన్నుకున్న కాంగ్రెస్ నాయకులు
mla-raghu-rama-raju | raghu rama krishnam raju party | Raghu Rama Krishnam Raju latest news | Raghu Rama Krishnam Raju Comments | Raghu Rama Krishnam Raju | raghu rama krishnam raju