Dangeti Jahnavi: అంతరిక్షంలోకి 23 ఏళ్ల తెలుగు యువతి జాహ్నవి..!

పాలకొల్లుకు చెందిన 23 ఏళ్ల దంగేటి జాహ్నవి అంతరిక్షంలో అడుగుపెట్టే అవకాశాన్ని దక్కించుకుంది. అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ నిర్వహించే స్పేస్‌ మిషన్‌ కోసం జాహ్నవి సెలక్ట్ అయ్యింది. భారత్‌ నుంచి అంతరిక్ష యానానికి ఎంపిక కావడం ఇదే మొదటిసారి.

New Update
Dangeti Jahnavi

Dangeti Jahnavi

చిన్నతనంలో కన్న కలలను సాధ్యం చేసుకుంది ఓ తెలుగు యువతి. ఆంధ్రాలో పుట్టిన ఆ యువతి అమ్మమ్మ చెప్పే చందమామ కధలను వింటూ అంతరిక్షంలోకి వెళ్లాలని కలలు కంది. ఇప్పుడు వాటిని నెరవేర్చుకుంటుంది. ఇంతకీ ఎవరీ ఆ తెలుగు యువతి? పూర్తి వివరాలు కూడా నేటి స్టోరీలో తెలుసుకుందాం. 

ఇది కూడా చూడండి: Jeedimetla Murder: జీడిమెట్ల తల్లి హత్య కేసులో షాకింగ్ నిజాలు.. నిందితురాలు చెల్లి ఏం చెప్పిందంటే?

మొదటి యువతిగా..

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 23 ఏళ్ల దంగేటి జాహ్నవి అంతరిక్షంలో అడుగుపెట్టే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ టైటాన్‌ స్పేస్‌ ఇండస్ట్రీస్‌ చేపట్టిన టైటాన్‌ స్పేస్‌ మిషన్‌ కోసం జాహ్నవి సెలక్ట్ అయ్యింది. భారత్‌లో జన్మించి, ఇక్కడే ఉంటున్న మహిళ ఇలా అంతరిక్ష యానానికి ఎంపిక కావడం ఇదే మొదటిసారి.

ఇది కూడా చూడండి: Bike Stunts: HYDలో ఒకే బైక్‌పై 8 మంది యువకుల స్టంట్.. పోలీసులకు దొరకడంతో.. (వీడియో)

ఇది కూడా చూడండి: Mosquito Drone: అమెరికాకు ఇక చుక్కలే.. దోమ సైజులో చైనా డ్రోన్.. వీడియో చూస్తే షాక్ అవుతారు!

అంతరిక్షంలోకి వెళ్లడానికి టైటాన్‌ స్పేస్‌ ప్రతినిధులు నిర్వహించిన పరీక్షల్లో జాహ్నవి విజయం సాధించి స్పేస్‌ మిషన్‌కు అర్హత సాధించింది. ఈ టైటాన్‌ స్పేస్‌ రోదసీలో భారీ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనుంది. అంతరిక్షంలో వాణిజ్య, పర్యాటక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. ఇందులో భాగంగానే కొందరు అంతరిక్షంలోకి పరిశోధక వ్యోమగాములు, పర్యాటకులను తీసుకెళ్లనుంది. 2029 మార్చిలో నిర్వహించబోయే మొదటి అంతరిక్ష యాత్ర బృందంలో ఇండియా నుంచి జాహ్నవి వెళ్లనుంది. ఈ యాత్రలో ఆమె ఐదు గంటలపాటు అంతరిక్షంలో గడపనుంది.

ఈ అంతరిక్షయానానికి ఎంపికైన అభ్యర్థులకు వచ్చే ఏడాది నుంచి మూడేళ్ల పాటు అమెరికాలో శిక్షణ ఇస్తారు. జాహ్నవి 2021లో నాసా నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌కు కూడా ఎంపికైంది. అయితే జాహ్నవి తల్లిదండ్రులు కువైట్‌లో ఉంటారు. అమ్మమ్మ దగ్గర పెరుగుతూ.. చంద మామ కథలు వినేది. అప్పటి నుంచి తనకు అంతరిక్షంలోకి వెళ్లాలనే కోరిక ఉండేదట. ఇప్పుడు ఆ కోరిక నెరవేరుతోంది. 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు