Ap Crime: ఏపీలో దారుణం.. సినీ ఫక్కీలో డెడ్ బాడీ పార్శిల్!
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో డెడ్బాడీ కలకలం రేపింది. ఓ మహిళకు వచ్చిన పార్శిల్లో గుర్తుతెలియని మృతదేహం రావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో డెడ్బాడీ కలకలం రేపింది. ఓ మహిళకు వచ్చిన పార్శిల్లో గుర్తుతెలియని మృతదేహం రావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పిఠాపురం హాస్పిటల్ అభివృద్ధి కమిటీ ప్రమాణస్వీకారం రసాభాసగా ముగిసింది. వేదిక మీద పవన్ కల్యాణ్ ఫోటో లేదని జనసేన...సీఎం చంద్రబాబు ఫోటో కూడా పెట్టలేదంటూ టిడిపి ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే వర్మ అక్కడి నుంచి వెళ్ళిపోవడం వివాదంగా మారింది.
ఏపీ ఏలూరులో జనసేన నేత 50 మంది అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయడం సంచలనం రేపుతోంది. తన బర్త్ డే సందర్భంగా నిడమర్రు మండలం క్రొవ్విడి గ్రామ శివారులోని ఓ మిల్లులో రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు జనసేన మండల అధ్యక్షుడు వాకమూడి ఇంద్ర. పోలీసులు దీనిపై విచారిస్తున్నారు.
వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ టీడీపీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రి పార్థసారధి, ఎమ్మెల్యే గౌతు శిరీషతో రమేష్ కనిపించారు. దీంతో పాటు ర్యాలీలో కూడా పాల్గొనడంతో పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది.
AP: పవన్ కళ్యాణ్కు వైసీపీ ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ లేఖ రాశారు. తణుకు సమీపంలో తేతలి వద్ద లేహం ఫుడ్ ప్రోడక్ట్స్ పై ఇటీవల కాలంలో గోవధ జరుగుతుందని పలు విమర్శలు వస్తున్నాయని, దీనిపై ప్రభుత్వం విచారణ జరిపించాలని లేఖలో పేర్కొన్నారు.
AP: జగన్కు సొంత పార్టీ నేతలే వరుస షాకులు ఇస్తున్నారు. తాజాగా వైసీపీకి భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కాకినాడలోని జేఎన్టీయూలో ఉభయ గోదావరి జిల్లా టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 14 టేబుళ్లపై మొత్తం 9 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో డిసెంబర్ 5న ఉపఎన్నికలు నిర్వహించారు.
ఏలూరులో ఇంటర్ చదువుతున్న ఓ మైనర్ బాలిక హాస్టల్లో ఆడ శిశువుకి జన్మనిచ్చింది. ఆ పసికందును హాస్టల్ నుంచి వేరే ఇంట్లోకి పడేయడంతో మరణించింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని విచారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.