Big Breaking: లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కదిరి నుంచి బయల్దేరిన పల్లె వెలుడు ఆర్టీసీ బస్సు వైఎస్సాఆర్ జిల్లా పులి వెందుల సమీపంలో 30 అడుగుల లోయలో పడిపోయింది.
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కదిరి నుంచి బయల్దేరిన పల్లె వెలుడు ఆర్టీసీ బస్సు వైఎస్సాఆర్ జిల్లా పులి వెందుల సమీపంలో 30 అడుగుల లోయలో పడిపోయింది.
AP: తన సోదరి షర్మిల, తల్లి విజయమ్మపై మాజీ సీఎం జగన్, భారతి పిటిషన్ వేశారు. సరస్వతి అధికార వాటాల వివాదంపై ఆయన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో పిటిషన్ ఫైల్ చేశారు. నవంబర్ 8న జగన్ పిటిషన్ పై విచారణ జరగనుంది.
ఏపీలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీకి నోటిఫికేషన్ వెల్లడైంది. కడపలోని(Guntur) డీఎస్ఏస్టేడియంలో ర్యాలీ నిర్వహించబోతున్నారు. నవంబర్10 నుంచి 15 వరకు ర్యాలీ ఉంటుంది. ఈ ర్యాలీలో 13 జిల్లాల అభ్యర్థులు మాత్రమే పాల్గొనే ఛాన్స్ ఉందని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.
జగన్, షర్మిలకు మధ్య గత కొన్నేళ్లుగా ఆస్తి తగాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తన ఆస్తిలో షర్మిలకు ఏమీ ఇచ్చేది లేదని అనుకున్న జగన్.. ఇప్పుడు ఆస్తి పంపకాలకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. బెంగళూరులో దీనిపై చర్చలు జరిగినట్లు సమాచారం. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి
వైఎస్సార్ జిల్లా బద్వేలు సమీపంలో ఇంటర్ విద్యార్థిని పెట్రోల్ దాడికి గురై ఆదివారం మృతి చెందింది. ఆ బాలిక పెళ్లి చేసుకోవాలని అడిగినందుకే విఘ్నేష్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఎస్పీ హర్షవర్ధన్రాజు వెల్లడించారు. వారిద్దరికీ ఐదేళ్లుగా పరిచయం ఉందని అన్నారు.
AP: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను చంద్రబాబు కాపాడలేకపోతున్నారని జగన్. మహిళలకు, బాలికలకు రక్షణకూడా ఇవ్వలేకపోతున్నారని అన్నారు. ప్రతిరోజూ ఏదోచోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయని అన్నారు.
AP: వైసీపీ మాజీ ఎమ్మెల్సీ జకియా ఖానంపై తిరుమల పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. శ్రీవారి దర్శన టికెట్లలో మోసం చేశారని బెంగళూరుకు చెందిన భక్తుడు ఆమెపై ఫిర్యాదు చేశారు. ఆరు వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లకు రూ.65 వేలు వసూలు చేశారని అందులో పేర్కొన్నారు.
AP: బద్వేల్లో పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. కడప రిమ్స్లో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచింది. శనివారం విద్యార్థినిపై ప్రేమోన్మాది విఘ్నేశ్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.
కడప జిల్లా గోపవరం మండలంలో దారుణం జరిగింది. సెంచురి ఫ్లైవుడ్ కంపెనీ సమీపంలో ఇంటర్ విద్యార్థినిపై ఐదుగురు నిందితులు అత్యాచారం చేశారు. ఆపై నిప్పటించారు. బాలిక కేకలు విన్న స్థానికులు మంటలను ఆర్పారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు.