విజన్ 2047తో మళ్లీ మోసం.. CBNపై షర్మిల ఫైర్!

AP: విజన్ 2047 పేరుతో సీఎం చంద్రబాబు మళ్ళీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని షర్మిల ఫైర్ అయ్యారు. రాష్ట్ర దశ - దిశ మారాలంటే తక్షణం కావాల్సింది విజన్లు కాదు.. విభజన హామీలన్నారు. రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలపాలంటే నెరవేరాల్సింది కేంద్రం ఇచ్చిన హామీలన్నారు.

New Update
YS Sharmila Emotional

YS Sharmila: సీఎం చంద్రబాబు, మోదీ ప్రభుత్వంపై మరోసారి విమర్శల వర్షం కురిపించారు ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. విజన్ 2047 పేరుతో సీఎం చంద్రబాబు మళ్ళీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ దశ - దిశ మారాలంటే తక్షణం కావాల్సింది విజన్లు కాదు.. విభజన హామీలు అని అన్నారు. రాష్ట్రాన్ని  నెంబర్ 1 గా నిలపాలంటే నెరవేరాల్సింది కేంద్రం ఇచ్చిన హామీలని పేర్కొన్నారు. దశాబ్ద కాలంగా విభజన హామీలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. పూర్తిగా అటకెక్కించారని నిప్పులు చెరిగారు. 

ప్రత్యేక హోదా హామీ...

రాష్ట్ర విభజన సమయంలో అనాడు UPA సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిందని అన్నారు. నూతన రాజధానికి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం ఇవ్వాలని సూచించిందని తెలిపారు. బుందేల్ ఖండ్ తరహాలో వెనుక బడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటన చేసిందని.. మౌలిక సదుపాయాల కల్పన, పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని షెడ్యూల్ 13 లో పొందపరించిందని తెలిపారు. కడప స్టీల్, దుగ్గరాజుపట్నం పోర్టులను నిర్మిస్తామని విభజన చట్టంలో పొందపరించిందని... నూతన రైల్వే జోన్, పెట్రోలియం యూనివర్సిటీ, విశాఖ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, విజయవాడ, విశాఖలో మెట్రో రైల్, హైదరాబాద్ నుంచి విజయవాడకు ర్యాపిడ్ రైల్, ఇలా ఎన్నో హామీలు నేటికీ కలగానే మిగిలాయని, ఇవ్వాళ్టికి ఒక్క హామీకి దిక్కులేకుండా పోయిందని ధ్వజమెత్తారు.

గడిచిన 10 ఏళ్లలో ప్రత్యేక హోదా వచ్చి ఉంటే పన్నుల్లో రాయితీలు ఉండేవని అన్నారు. వేల సంఖ్యలో కొత్త పరిశ్రమలు వచ్చేవని, లక్షల్లో ఉపాధి అవకాశాలు లభించేవని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యి ఉంటే రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేదని తెలిపారు. విజయవాడ, విశాఖలో మెట్రో రైల్ నిర్మాణం జరిగితే ప్రధాన నగరాలుగా అభివృద్ధి చెందేవని అన్నారు. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు అంది వుంటే పేదరిక నిర్మూలన సాధ్యం అయ్యేదని.. విభజన హామీలు అమలయ్యి ఉంటే రాష్ట్రం దిశ - దశ పూర్తిగా మారేదని అభిప్రాయపడ్డారు. దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ విరాజిల్లేదని అన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు