/rtv/media/media_files/xuwpsSA6ABVfhNQGCEGT.jpg)
మంత్రివర్గ విస్తరణపై తెలంగాణ పాలిటిక్స్ లో ఏడాదిన్నరగా కొనసాగుతున్న ఉత్కంఠకు నేటితో తెరపడింది. దీంతో కొత్త మంత్రులకు ఏ శాఖలు కేటాయిస్తారన్న చర్చ మొదలైంది. అయితే.. మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎం రేవంత్ ఫైనల్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్కు విద్యాశాఖ ఖరారైనట్లు తెలుస్తోంది. వాకిటి శ్రీహరికి హోంశాఖ, అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ సంక్షేమ శాఖలను కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ రోజు సాయంత్రం మంత్రులకు కొత్త శాఖల కేటాయింపుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Also Read : రూ. లక్ష పొందే కొత్త స్కీమ్.. మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
Also Read : గాజాలో ఆస్పత్రి కిందే హమాస్ సొరంగం.. సంచలన వీడియో
తీవ్ర అసంతృప్తిలో ఆ ముగ్గురు..
ఇదిలా ఉంటే.. మంత్రివర్గ విస్తరణపై పుట్టెడు ఆశలు పెట్టుకున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫోన్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మల్ రెడ్డి రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి అయితే ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేయడానికి సైతం సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. వీరిని బుజ్జగించేందుకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగారు. భవిష్యత్ లో అవకాశాలు వస్తాయని.. తొందరపడొద్దని సూచిస్తున్నారు.
Also Read : పబ్లిక్ టాక్ కోసం నేరుగా రంగంలోకి దిగిన స్టార్ హీరో! (వీడియో వైరల్)
Also Read : రేపట్నుంచి AP PGCET 2025 పరీక్షలు - ఫుల్ షెడ్యూల్ ఇదే
latest-telugu-news | telugu breaking news | today-news-in-telugu | telangana-politics | Revanth Reddy | latest telangana news | telangana news today | telangana-news-updates