/rtv/media/media_files/2025/06/08/JUs0SEHEYrGM9jBSVmgD.jpg)
ntr vidya sankalpam scheme for dwacra womens children
ఏపీలోని కూటమి సర్కార్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పబోతుంది. త్వరలో మరో కొత్త స్కీమ్కు శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు భరోసానిచ్చేలా కొత్త పథకానికి రూపకల్పన చేసింది. దీని కోసం ‘ఎన్టీఆర్ విద్యా సంకల్పం’ స్కీమ్ను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ స్కీమ్ ద్వారా డ్వాక్రా మహిళల పిల్లల విద్యా వికాసానికి తోడ్పడేందుకు 4 % వడ్డీకే (35 పైసలు) రుణాలు అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
రూ.లక్ష పొందే అవకాశం
గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (SERP) పరిధిలోని స్త్రీ నిధి బ్యాంకు ద్వారా డ్వాక్రా మహిళలకు రుణాలు అందించనున్నారు. ఈ స్కీమ్లో భాగంగా రూ.10,000 నుంచి రూ. లక్ష వరకు రుణాన్ని ఇవ్వనున్నారు. ప్రస్తుతం స్త్రీనిధి ద్వారా డ్వాక్రా మహిళలకు 11% వడ్డీతో రుణాల్ని అందిస్తున్నారు.
Also Read : ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి
ఇప్పుడు ప్రభుత్వం ఈ కొత్త పథకాన్ని ‘ఎన్టీఆర్ విద్యా సంకల్పం’ పేరుతో రుణాల్ని అందివ్వాలని నిర్ణయించింది. ఈ ‘ఎన్టీఆర్ విద్యా సంకల్పం’ పథకానికి సంబంధించిన పూర్తిస్థాయి నివేదికను అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. దీనిని కేజీ నుంచి పీజీ వరకు అమలు చేయనున్నారు.
ముఖ్యమైన అంశాలు
ఈ ‘ఎన్టీఆర్ విద్యా సంకల్పం’ పథకాన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్, విద్యా సంస్థల్లో చదివే స్టూడెంట్స్కు వర్తింప చేయనున్నారు. ఈ పథకంలో భాగంగా స్త్రీనిధి నుంచి తీసుకున్న రుణాన్ని పిల్లల చదువుకే ఉపయోగించాలి. ఈ రుణాన్ని దేనికోసం వినియోగించారో సంబంధిత రసీదును స్త్రీనిధి అధికారులకు సమర్పించాలి. ఇక తీసుకున్న రుణ మొత్తాన్ని వాయిదాల రూపంలో కట్టాలి. 24 నెలల నుంచి 36 నెలల వరకు చెల్లించే వెసులుబాటు అధికారులు కల్పించనున్నారు.
Also Read: మద్యం తాగడం అనే పొరపాటు చేయకండి! మీ కాలేయం పాడైపోతుంది.. ఫ్రూఫ్ ఇదే!
chandrababu | ap-govt | ap cm chandrababu naidu | ntr vidya sankalpam scheme | latest-telugu-news | today-news-in-telugu | andhra-pradesh-news