KESARI CHAPTER 2: ఓటీటీలోకి అక్షయ్ కుమార్ హిస్టారికల్ డ్రామా!

అక్షయ కుమార్, మాధవన్, అనన్య పాండే ప్రధాన పాత్రలో నటించిన 'కేసరి చాప్టర్ 2' ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. జలియన్ వాలా బాగ్ మారణకాండ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని కరణ్ సింగ్ త్యాగి తెరకెక్కించారు. 

New Update

Kesari Chapter 2:  అక్షయ్ కుమార్, మాధవన్ లీడ్ రోల్స్ లో నటించిన హిస్టారికల్ డ్రామా కేసరి చాప్టర్ 2 ఇప్పుడు ఓటీటీ ప్రియలను అలరించేందుకు సిద్ధమైంది. గత నెల విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో నెత్తుటి అద్యాయమైన జలియన్ వాలా బాగ్ మారణకాండ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని "ది కేస్ దట్ షుక్ ది ఎంపైర్"  అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కించారు. 

Also Read: Ustaad Bhagat Singh: ఈసారి తుఫానే.. 'ఉస్తాద్ భగత్' సెట్ లో అడుగుపెట్టిన పవర్ స్టార్.. వీడియో అదిరింది!

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

ఇపుడీ ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. జూన్ 13 నుంచి జియో హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చింది. థియేటర్ లో ఈ సినిమాను మిస్సైన వారు వెంటనే ఓటీటీలో చూసేయండి.  దేశభక్తితో నిండిన ఈ  కథ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.  ఇందులో అక్షయ్ కుమార్ బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా..  జలియన్ వాలాబాగ్ మారణకాండం వెనుక ఉన్న నిజాలను బయటపెట్టే  న్యాయవాది శంకరన్ నాయర్ పాత్రలో నటించారు. హీరో మాధవన్ బ్రిటీష్ ప్రభుత్వం తరుపు న్యాయవాదిగా నటించారు. వీరితో పాటు అనన్య, రెజీనా తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

ధర్మ ప్రొడక్షన్స్  బ్యానర్ పై కరణ్ జోహార్ తదితరులు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించారు. తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ రానా దగ్గుబాటి ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశారు. 

Also Read: Air India: బాలీవుడ్ స్టార్ హీరో బావనే కోపైలట్.. ‘12th ఫెయిల్’ నటుడి సంతాపం

Advertisment
Advertisment
తాజా కథనాలు