Fire Accident: షాకింగ్.. శవాన్ని దహనం చేస్తుండగా ఎగసిపడిన నిప్పురవ్వలు - ఊరు ఊరంతా భయంతో పరుగులు!

జగిత్యాలలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అర్బన్ మండలం ధరూర్‌‌లోని స్క్రాప్‌ దుకాణంలో మంటలు ఎగసిపడుతున్నాయి. ఫైర్‌సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. శ్మశానంలో శవాన్ని దహనం చేస్తుండగా నిప్పురవ్వలు ఎగిరిపడ్డాయి. ఈ క్రమంలో మంటలు చెలరేగాయి.

New Update
hyderabad Jagityala Dharur fire accident in scrap company

hyderabad Jagityala Dharur fire accident in scrap company

జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. అర్బన్ మండలం ధరూర్‌లోని స్క్రాప్‌(తుక్కు) షాపులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన నల్లటి పొగ, భారీగా ఎగసిపడుతున్న మంటలతో చుట్టుపక్కల ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుంది. 

ఊరు ఊరంతా భయంతో పరుగులు

అనంతరం మంటలను అదుపు చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంది. అంతకంతకు మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో వారికి కూడా కష్టంగా మారింది. అందులోనూ ఆ స్క్రాప్ షాప్ పక్కనే పెట్రోల్ బంక్‌తో ఒక గృహ సముదాయం ఉంది. దీంతో స్థానికులు మరింత భయంతో వణికిపోతున్నారు. నల్లటి పొగ కారణంగా ధరూర్ గ్రామం మొత్తం చిమ్మచీకటిని తలపించింది. 

Also Read: జనగణన ఆలస్యం.. మోదీ సర్కార్‌పై స్టాలిన్‌ సంచలన ఆరోపణలు

Also Read: గృహ హింస బాధితురాలికి రూ.కోటి పరిహారం ఇవ్వాలన్న కోర్టు

ఈ ప్రమాదానికి అసలు కారణం ఒకటుంది. స్క్రాప్ షాప్‌కు పక్కనే ఉన్న శ్మశానంలో ఓ వృద్ధురాలికి దహన సంస్కారాలు నిర్వహించారు. అనంతరం గాలి విపరీతంగా వీయడంతో దాని నుంచి వచ్చిన నిప్పురవ్వలు స్క్రాప్ షాప్‌లో పడ్డాయి. దీని కారణంగానే ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది అని సమీప సాక్షులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 

fire accident | hyderabad | telangana crime incident | telangana crime news | telangana-crime-updates | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | telugu crime news
Advertisment
Advertisment
తాజా కథనాలు