/rtv/media/media_files/2025/06/07/aL28FioTve1R893hsAOG.jpg)
Monkey: ఓ ఆలయాని(Temple)కి వెళ్లిన కుటుంబం చేతిలో ఉన్న నగల పర్సును ఓ కోతి కొట్టేసింది. ఆ పర్సులో రూ.20 లక్షల విలువచేసే నగలు ఉండటంతో ఆ కుటుంబం లబోదిబోమని తలబాదుకుంది. ఉత్తరప్రదేశ్(uttarpradesh) లోని బృందావనంలో ఈ ఘటన జరిగింది. ఇక కోతిని వెంబడించిన కుటుంబం కన్నుగప్పి పారిపోయింది. దీంతో చేసేది లేక వారు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. తీవ్రంగా గాలించిన తర్వాత కోతి పారేసిన పర్సు దొరికింది. దాన్ని బాధితులకు అందించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇది కూడా చదవండి: వాయు కాలుష్యంతో అనేక ప్రమాదాలు.. తెలుసుకుంటే షాక్ అవుతారు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అలీఘర్కు చెందిన అభిషేక్ అగర్వాల్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి బృందావన్లో ఉన్న బాంకే బిహారీ ఆలయానికి వచ్చాడు. గుడిలోకి వెళ్లే సమయంలో దొంగలు ఉంటారనే భయంతో అభిషేక్ భార్య తన రూ.20 లక్షల విలువైన నగలను తీసి పర్సులో పెట్టుకున్నారు. ఆ పర్సును వెంట తీసుకెళ్లారు. అయితే వారనుకున్నట్లు దొంగలు ఏం చేయలేదు కానీ ఎక్కడి నుంచి వచ్చిందో ఒక కోతి మాత్రం నగలున్న పర్సును లాక్కొని పరుగెత్తింది. అది చిన్న చిన్న సందుల నుంచి పరుగెత్తి మాయమైంది. వారు ఎంత వెతికినా లాభం లేకుండా పోయింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్లో జంట హత్యల కలకలం.. భార్య, భర్తను గొంతు కోసి!
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ సహాయంతో కోతి పరుగెత్తిన దిక్కున తీవ్రంగా గాలించారు. కొన్ని గంటల గాలింపులు అనంతరం కోతి పర్సును ఒక చెట్ల పొదల్లో పడేసి వెళ్లినట్లు గుర్తించి దానిని తీసుకొని అభిషేక్కు అప్పగించడంతో కథ సుఖాంతమైంది.
Also Read : ఏపీలో మత్తు ఇంజెక్షన్ల కలకలం
Also Read: ఉక్రెయిన్ను చావుదెబ్బ కొట్టిన రష్యా.. వందలాది డ్రోన్లు, క్షిపణులతో దాడులు