Domestic Violence Case: గృహ హింస బాధితురాలికి రూ.కోటి పరిహారం ఇవ్వాలన్న కోర్టు

ముంబైలోమ్ ఓ సెషన్స్‌ కోర్టు కీలక తీర్పునిచ్చింది. గృహహింస బాధితురాలికి ఉన్న పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.కోటికి పెంచింది. ఆమె భర్త ఎలివేటర్ కంపెనీ నడిపిస్తున్నాడని.. అతడి వద్ద భారీగానే డబ్బులు ఉన్నాయంటూ వ్యాఖ్యానించింది.

New Update
‘Crorepati’ husband must pay 1 crore to abused wife, Says Sessions Court

‘Crorepati’ husband must pay 1 crore to abused wife, Says Sessions Court


ముంబైలోమ్ ఓ సెషన్స్‌ కోర్టు కీలక తీర్పునిచ్చింది. గృహహింస బాధితురాలికి ఉన్న పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.కోటికి పెంచింది. ఆమె భర్త ఎలివేటర్ కంపెనీ నడిపిస్తున్నాడని.. అతడి వద్ద భారీగానే డబ్బులు ఉన్నాయంటూ వ్యాఖ్యానించింది. అతడి 20 ఏళ్ల కాలంలో శారీరక, మానసిక హింస ఎదుర్కొన్నారని పేర్కొంది. అలాగే నిర్వహణ ఖర్చుల కింద భార్య, కుమార్తెకు నెలవారిగా ఇచ్చే మొత్తాన్ని కూడా రూ.లక్ష నుంచి రూ.లక్షన్నరకు పెంచింది.  

Also Read: కరువు మొదలైంది..సింధు జలాల కోసం భారత్ కు పాక్ నాలుగు లెటర్స్

1997లో వాళ్లకు పెళ్లి జరగినప్పటి నుంచి బాధితురాలికి భర్త, అతడి కుటుంబం మానసికంగా, ఆర్థికంగా తీవ్ర వేదనకు, అవమానాలకు గురిచేశారని జడ్జి అన్సారీ అన్నారు. చివరికి ఆమె భరణం కోసం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పారు. అయితే భర్త చేసిన వాదనను జడ్జి తోసిపుచ్చారు. తన భార్య వల్ల ఆర్థికంగా చితికిపోయానని.. ఇద్దరు కొడుకుల చదువు, పోషణ కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నానని, కనీసం ఇంటి అద్దె కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పాడు. 

Also Read: ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం..  తల్లీబిడ్డకు ప్రాణం పోసిన ప్రైవేట్ హాస్పిటల్

కానీ జడ్జి ఆయన మాటలను తిరస్కరించారు. దీనికి ఆధారాలు ఏవని ప్రశ్నించారు. తాము అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతే పరిహారంతో పాటు మహిళకు, ఆమె కూతురుకు మజూరు చేసిన భరణాన్ని పెంచినట్లు తేల్చిచెప్పారు. గృహ హింస నిరోధక చట్టం కింద జడ్జి ఈ తీర్పును వెలువరించారు. 

Also Read: అయోధ్య ప్రసాదం పేరు చెప్పి ఆన్‌లైన్‌లో రూ.3.85 కోట్లు స్వాహా

Also Read: ఆపరేషన్ సిందూర్ పేరు వింటే పాకిస్తాన్‌కు అదే గుర్తువస్తుంది: PM మోదీ

Advertisment
Advertisment
తాజా కథనాలు