Karnataka: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి
కర్ణాటకలోని మాండ్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కీర్తి కెమికల్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
కర్ణాటకలోని మాండ్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కీర్తి కెమికల్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్ నగరంలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ల్యాబ్ నుంచి దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. మొదటి అంతస్తులోని కంప్యూటర్ ల్యాబ్లో తొలుత మంటలు చెలరేగి భవనానికి వ్యాపించాయి.
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంటల్లో కాలిపోయింది. ఈ ప్రమాదానికి ముందు ప్రయాణికులను డ్రైవర్ అలెర్ట్ చేయగా అందరూ సురక్షితంగా బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది.
కరాచీలో సద్దర్ ప్రాంతంలోని గుల్ షాపింగ్ ప్లాజాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇందులో మరణించిన వారి సంఖ్య దాదాపు వంద దాకా ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. దాదాపు 36 గంటల పాటూ మంటలు చెలరేగాయి.
హైదరాబాద్ కూకట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి కూకట్పల్లి రాజీవ్ గాంధీ నగర్లోని ఓ గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్యాస్ రీఫిలింగ్ చేస్తుండగా గ్యాస్ లీకై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
కోనసీమ అంటే ప్రకృతి అందాలు..పండుగలు..రకరకాల వంటకాలు మాత్రమే గుర్తుకు వచ్చే ప్రాంతం. అలాంటిది అక్కడ జరిగిన ఓ ఘటన దేశం యావత్తు కోనసీమ వైపు భయంతో చూసేలా చేసింది. అదే ONGC గ్యాస్ లీక్ వల్ల ఏర్పడిన పాశర్లపూడి బ్లో ఔట్. ఈ ఘటనకు 30 ఏళ్ళు పూర్తయ్యాయి
కేరళలోని త్రిసూర్ రైల్వేస్టేషన్ పార్కింగ్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో వందలాది బైకులు దగ్ధమయ్యాయి. బైక్ పార్కింగ్ ప్రాంతంలో ఈ తెల్లవారు జామున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పెయిడ్-పార్కింగ్ షెడ్లో ఉదయం 6.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి.
ఇండోనేసియాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సులవేసి ద్వీపంలోని నర్సింగ్ హోమ్లో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 16 మంది సజీవ దహనమవ్వడం కలకలం రేపుతోంది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్ద ఆదివారం అర్థరాత్రి ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా సుమారు 2 వేల మందిని మరో ట్రైన్ లో సురక్షితంగా వారివారి గమ్యస్థానాలకు చేర్చారు.