న్యూయర్ వేడుకల వేళ విషాదం.. 10 మంది మృతి
కొత్త సంవత్సరం వేళ అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ వాహనం జనాలపైకి దూసుకెళ్లడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి పైగా గాయాలపాలయ్యారు. లూసియానాలోని న్యూ ఆర్లీన్స్లో ఈ విషాదం చోటుచేసుకుంది.
కొత్త సంవత్సరం వేళ అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ వాహనం జనాలపైకి దూసుకెళ్లడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి పైగా గాయాలపాలయ్యారు. లూసియానాలోని న్యూ ఆర్లీన్స్లో ఈ విషాదం చోటుచేసుకుంది.
తన ట్రెజరీ డిపార్ట్మెంట్ మీద చైనా సైబర్ దాడులకు పాల్పడిందని అమెరికా ఆరోపిస్తోంది. వర్క్ స్టేషన్లలో కీలక పత్రాలను దొంగలించేందుకు ప్రయత్నించినట్లు తెలిపింది. డిసెంబర్ ప్రారంభంలో ఈ సైబర్ దాడి జరిగినట్లు చెప్పింది.
అమెరికా కొత్త అధ్యక్షుడిగా ట్రంప్ ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. కానీ తాను ముందు నుంచీ చెబుతున్నట్టుగానే అక్రమ వలదారులను దేశం నుంచి సాగనంపుతున్నారు. తాజాగా మరో 18వేల మంది భారతీయులను పంపించేయనున్నారని తెలుస్తోంది.
అమెరికన్ ఎయిర్ లైన్స్ విమాన సేవలకు ఆటంకం ఏర్పడింది. దీని కారణంగా ఆ సంస్థకు చెందిన విమానాలన్నీ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్రిస్మస్ సెలవుల్లో ఇలా జరగడంతో టూరిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికాలో హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామానికి చెందిన బండి వంశీ అనుమానాలకు దారి తీస్తోంది. నిన్నరాత్రి అతను ఉంటున్న అపార్ట్మెంట్ గ్రౌండ్లో ఫ్లోర్లో కారు సీట్లో శవమై కనిపించాడు.
ఇకపై అమెరికా హెచ్-1బీ వీసాల ప్రాసెస్ను సులభతరం చేస్తున్నట్లు బైడెన్ కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. ఎఫ్-1 విద్యార్థి వీసాలను ఇకపై హెచ్-1బీ వీసాలుగా ఈజీగా మార్చుకోవచ్చని తెలిపింది. అయితే ఈ నిబంధనలు2025 జనవరి 17 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది.
తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే అక్రమ వలసదారులను వెళ్లగొడతానని తాజాగా ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. చట్టబద్ధంగా అమెరికాకి వలస వచ్చేవారికి మార్గం సులువు చేస్తానన్నారు. దీనివల్ల భారతీయులకు ప్రయోజనం కలగనుందనే ప్రచారం నడుస్తోంది.
అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య చాలావరకు తగ్గింది. ఈ ఏడాది ఇండియన్ స్టూడెంట్స్కు జారీ చేసే ఎఫ్-1 స్టూడెంట్ వీసాలు ఏకంగా 38 శాతం తగ్గిపోయాయి. జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య 64,008 మందికే ఈ వీసాలు జారీ అయ్యాయి. 2023లో ఈ సంఖ్య 1,03,485గా ఉంది.