IND PAK WAR 2025: పహల్గాం ఉగ్రదాడుల తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధవాతావరణాన్ని అగ్రదేశం అమెరికా సునిశీతంగా పరిశీలిస్తోంది. మరోవైపు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మరోసారి ఇరుదేశాలకు కీలక సూచన చేశారు. ఇరు దేశాలు దాడులను తక్షణమే తగ్గించాలని పిలుపునిచ్చారు.
ఇది కూడా చూడండి: IND PAK WAR 2025: జైసల్మేర్లో 70కి పైగా డ్రోన్లు, క్షిపణులు గాల్లోనే ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ!
ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జై శంకర్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ లకు ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. రెండు దేశాలు చర్చించుకోవడానికి అమెరికా మద్దతునిస్తుందని స్పష్టం చేశారు. ఇరు దేశాలు అంగీకరిస్తే భారత్, పాకిస్తాన్ మధ్య చర్చలకు మధ్య వర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అదే సమయంలో పహల్గామ్ వంటి ఉగ్రదాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఖరాఖండిగా చెప్పారు మార్కో రూబియో.
ఇది కూడా చూడండి: BIG BREAKING: జమ్ము కశ్మీర్కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా
దక్షిణాసియాలో శాంతి, భద్రతలను కాపాడాలని మార్క్ రూబియో భారత్, పాక్ లను కోరారు. ఉగ్రవాదంపై పోరులో భారత్కు సహకరించేందుకు కట్టుబడి ఉన్నామని తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రెండు దేశాలు శాంతిని కాపాడాలని కోరారు. కాగా మార్క్ రూబియో మాట్లాడిన అనంతరం భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జై శంకర్ సోషల్ మీడియాలో స్పందించారు.పహల్గాం ఉగ్రదాడి గురించి యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో అడిగి తెలుసుకున్నారు. వారి మృతికి సంతాపం తెలిపారు. పహల్గాం దాడి నేరస్థులు, మద్దతుదారులు, ప్రణాళికకర్తలకు తగిన శిక్షపడాలి" అని పేర్కొన్నారన్నారు.
ఇది కూడా చూడండి: FLASH NEWS: పాక్ ప్రధాని ఇంటి పక్కనే డ్రోన్ దాడి.. బంకర్లోకి తరలింపు
అదే సమయంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తోనూ మాట్లాడిన రూబియో పహల్గాం దాడిని ఖండించాలని సూచించారు. అలాగే ఈ దాడిపై జరిపే విచారణకు పాకిస్తాన్ పూర్తిగా సహకరించాలని సూచించారు. ఇక మీదట ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ అందించే ఏ మద్దతును నిలిపివేయాలని గట్టిగా కోరారు. ఇరు దేశాల మధ్య కమ్యూనికేషన్లను మెరుగుపరచడానికి జరిగే ప్రయత్నాలను ప్రోత్సహిస్తామని మార్కో రూబియో పేర్కొన్నారు.
ఇది కూడా చూడండి:BIG BREAKING: పాక్ ఫైటర్ జెట్ పైలెట్ ను సజీవంగా పట్టుకున్న భారత్