/rtv/media/media_files/money7.jpeg)
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన దగ్గర నుంచీ కొత్త కొత్త రూల్స్ పెడుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఆర్ధికంగా డౌన్ లో ఉన్న అమెరికాను ఎలా అయినా మళ్ళీ ప్రపంచ నంబర్ వన్ చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. దాని కోసం కొత్త కొత్త రూల్స్ పెడుతున్నారు. ప్రతీకార సుంకాల పేరుతో దాదాపు అన్ని దేశాల మీదనా అత్యంత ఎక్కువ సుంకాలు విధించారు. దాంతో వాణిజ్య యుద్ధం మొదలైంది. చైనా, కెనడాలు ప్రత్యక్షంగా యుద్ధం చేస్తుంటే...మిగతా దేశాలు పరోక్షంగా వ్యతిరేకత చూపించాయి.
వలసదారులపై తీవ్ర ప్రభావం..
ఇప్పుడు తాజాగా ట్రంప్ ప్రభుత్వం మరో కొత్త విధానాన్ని అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెమిటెన్స్లపై అంటే అమెరికా నుంచి విదేశాలకు డబ్బులు పంపించడంపై ఐదు శాతం ఎక్సైజ్ సుంకం విధించాలనుకుంటున్నారు. ఇది అమెరికాకు వలస వెళ్ళిన ప్రతీవారికీ వర్తిస్తుంది. గ్రీన్ కార్డ్ హోల్డర్ లేదా H1B వీసాపై పని చేయడానికి అక్కడికి వెళ్లిన ప్రతి వలసదారునికి ఈ కొత్త రూల్ వర్తించనుంది. దీని వల్ల దాదాపు 4 కోట్ల మంది వలసదారులు ప్రభావితమవుతారని అంచనాలు వెలువడుతున్నాయి. భారతీయులపై కూడా ఇది అత్యంత క్కువ ప్రభావం చూపించనుంది. భారత్కు వచ్చే నగదుకే దాదాపు 1.6 బిలియన్ డాలర్లు పన్ను రూపంలో చెల్లించాల్సి వస్తుందని అంచనా. ఆర్బీఐ గణాంకాల ప్రకారం.. అమెరికా నుంచే భారత్కు అందుతున్న రెమిటెన్స్లు 2010లో 55.6 బిలియన్ డాలర్లుగా ఉండగా.. 2023-24కు 118.7 బి.డాలర్లకు పెరిగింది. ఇందులో అమెరికా నుంచి 27శాతం రాగా.. దానిపై 5శాతం పన్ను అంటే 1.64 బి.డాలర్లు అవుతుంది.
ప్రపంచ బ్యాంకుల లెక్కల ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా రెమిటెన్స్ లు అందుకుంటున్న దేశాల్లో 2008 నుంచి భారత్ మొదటిస్థానంలో ఉంది. ప్రపంచ రెమిటెన్స్లలో 11శాతం ఉండగా.. 2024నాటికి 14శాతానికి పెరిగింది. భారత్ తర్వాత మెక్సికో, చైనా, ఫిలిప్పీన్స్, పాకిస్తాన్ లు తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
today-latest-news-in-telugu | usa | 47th us president donald trump | money
Also Read: Neeraj Chopra: జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా కొత్త రికార్డ్..90 మీటర్ల మార్క్ జుజుబీ