Syria Clashes Latest Updates | గన్స్, బాంబ్స్ సిరియాలో వెయ్యి మంది | G1000 Alawite Civilians | RTV
సిరియాలో ఇంకా అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి హింస చెలరేగింది. అసద్ మద్దతుదారులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణల్లో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
సిరియా హింసలో చనిపోయిన మృతుల సంఖ్య వెయ్యికి చేరింది. ఇక్కడ అంతర్యుద్ధం మొదలయ్యాక ఇదే అత్యంత ఘోరమైన ఘటనగా దీన్ని చెబుతున్నారు. బ్రిటన్కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ ఘర్షణకు సంబంధించి వివరాలను తెలిపింది.
సిరియాలో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. భద్రతా దళాలు, అసద్ మద్దతుదారుల మధ్య ఘర్షణలు, దాడులు భీకరంగా జరుగుతున్నాయి. దీని వలన రెండు రోజుల్లోనే 600మంది చనిపోయారు.
సిరియా తీరప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో 200 మందికి పైగా మరణించారు. ఇది అసద్ గ్రూపునకు, ప్రభుత్వ దళాలకు చెందిన హయత్ తహ్రీర్ అల్-షామ్ నేతృత్వంలోని గ్యాంగ్ చేసిన ఘోరమైన దాడిగా పేర్కొంటున్నారు.
సిరియాను తిరుగుబాటుదారులు ఆక్రమించడంతో ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ రష్యాకు పారిపోయాడు. ఆ తరువాత సిరియాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ క్రమంలో గవర్నమెంట్ ఉద్యోగులకు 400 శాతం మేరకు జీతాలు పెంచుతామని ఆర్థిక మంత్రి అబ్జాద్ చెప్పారు.
రష్యాలో తల దాచుకున్న సిరియా మాజీ అధ్యక్షుడు అసద్ పరిస్థితి ప్రస్తుతం సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. తీవ్రమైన దగ్గుతో ఊపిరి తీసుకోలేక ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్య పరీక్షల్లో విషపదార్ధాల ఆనవాళ్ళు కనిపించాయని అంటున్నారు.
ఉత్తర సిరియాలోని మన్బిజ్ నగరంలో కారులో బాంబు దాడి ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు మృతి చెందారు. అయితే ఈ బాంబు దాడికి ఎవరూ పాల్పడ్డారనే పూర్తి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.