Manipur: మణిపూర్కు ప్రధాని మోదీ వరాల జల్లు.. రూ.8500 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన!
మణిపూర్లో రెండు తెగల మధ్య జరిగిన అల్లర్ల తర్వాత ప్రధాని మోదీ అక్కడ పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ క్రమంలో ఆ నిరసనలో మృతి చెందిన బాధిత కుటుంబాలను మోదీ పరామర్శించారు. అలాగే రూ. 8500 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించి శంకు స్థాపన చేశారు.