/rtv/media/media_files/2025/09/13/modi-in-manipur-2025-09-13-15-10-22.png)
మణిపూర్ అల్లర్లు అనే పదం మూడేళ్లుగా సోషల్ మీడియా, వార్తల్లో తరుచూ వినిపిస్తోంది. 2023 మే 3న ప్రారంభమైన ఈ అల్లర్లు ఇంకా చల్లారలేదు. 2024 నవంబర్ నాటికి ఈ హింస కారణంగా 258 మంది చనిపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ వెల్లడించారు. ఇంత పెద్ద ఎత్తున హింస చెలరేగినా.. ప్రధాన మోదీ అక్కడ పర్యటించలేదన ప్రతిపక్షాలు పలుమార్లు డిమాండ్ చేస్తున్నారు. మూడేళ్ల తర్వాత ప్రధాని మోదీ ఈరోజు (శనివారం) మణిపూర్లో పర్యటించారు. అసలు మణిపూర్ అల్లర్లకు కారణం, ఇప్పటి వరకు అక్కడ జరిగిన పరిణామాలు 360 డిగ్రీల్లో చూద్దాం..
గిరిజన సంఘీభావ యాత్రతో అల్లర్లు ప్రారంభం
మణిపూర్లో అల్లర్లు చెలరేగడానికి అనేక కారణాలు ఉన్నా.. తక్షణ కారణం మాత్ర ఓ ర్యాలీ. 2023 మేలో మెయిటీలకు ఎస్టీ (షెడ్యూల్డ్ ట్రైబ్) హోదా ఇవ్వాలనే డిమాండ్ను వ్యతిరేకిస్తూ కుకీలు "గిరిజన సంఘీభావ యాత్ర" నిర్వహించారు. ఈ యాత్ర సందర్భంగా హింస చెలరేగి, అది రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించింది. అంతకు కొన్ని రోజుల ముందు, మణిపూర్ హైకోర్టు మెయిటీలకు ఎస్టీ హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం కూడా ఈ అల్లర్లకు ఒక ప్రధాన ప్రేరణ.
జరిగిన నష్టం
మణిపూర్ అల్లర్లలో వేలాది ఇళ్లు, దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులై, సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఈ అల్లర్లలో మహిళలపై అత్యంత దారుణమైన దాడులు, అత్యాచారాలు జరిగాయి. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, వారిపై లైంగిక దాడి చేసిన వీడియో బయటపడటంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. పోలీసుల నుండి భారీగా ఆయుధాలు లూటీ చేయబడ్డాయి, ఇది హింసను మరింత పెంచింది. అల్లర్లను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విమర్శలు వచ్చాయి. ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ తీరుపైనా విపక్షాలు, ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Manipur is a vital pillar of India's progress. Addressing a programme during the launch of development initiatives in Churachandpur. https://t.co/1JENvDXOoE
— Narendra Modi (@narendramodi) September 13, 2025
రాష్ట్రపతి పాలన
మణిపూర్లో అల్లర్లు, రాజకీయ అస్థిరత కారణంగా 2025 ఫిబ్రవరిలో రాష్ట్రపతి పాలన విధించారు. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రాష్ట్రపతి పాలనను మొదట ఆరు నెలల కాలానికి విధించారు. తరువాత, పరిస్థితి ఇంకా అదుపులోకి రాని కారణంగా, ఈ పాలనను మరో ఆరు నెలలు పొడిగించారు. అంటే, మణిపూర్లో రాష్ట్రపతి పాలన 2026 ఫిబ్రవరి 13 వరకు కొనసాగనుంది.
Manipur unrest was a staged coup by Deep State & CIA for regime change in Bharat.
— BALA (@erbmjha) September 13, 2025
Never forget ---- PM Modi shielded Bharat against regime change plots like Bangladesh, Sri Lanka & Nepal. pic.twitter.com/PXqaIktZk3
అల్లర్లకు ఇతర కారణాలు
గిరిజన హోదా వివాదం: అల్లర్లకు తక్షణ కారణం మైతేయి వర్గానికి షెడ్యూల్డ్ తెగ (ST) హోదా కల్పించాలని మణిపూర్ హైకోర్టు ఆదేశించడం. దీని వల్ల మైతేయిలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు లభిస్తాయి, అలాగే కొండ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసే అవకాశం వస్తుంది. దీనిని కుకీ, నాగా వంటి గిరిజన తెగలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎందుకంటే, ఇది తమ హక్కులను, వనరులను తగ్గిస్తుందని వారు భావించారు.
భూమి యాజమాన్య హక్కులు: మణిపూర్లో 10 శాతం భూమి మాత్రమే మైదాన ప్రాంతంలో ఉంది, ఇక్కడ మెజారిటీ మెయితీలు నివసిస్తున్నారు. మిగిలిన 90 శాతం కొండ ప్రాంతాల్లో కుకీలు, నాగాలు నివసిస్తున్నారు. గిరిజనేతరులు కొండ ప్రాంతాల్లో భూములు కొనడానికి చట్టం అనుమతించదు. మెయితీలకు గిరిజన హోదా ఇస్తే, ఈ చట్టం వల్ల వారికి భూమి కొనుగోలుపై ఉన్న ఆంక్షలు తొలగిపోతాయి. ఇది కుకీలు, నాగాల మధ్య తీవ్ర ఆందోళనకు దారితీసింది.
అడవుల నుండి గిరిజనులను తొలగించడం: ప్రభుత్వం రిజర్వ్ ఫారెస్ట్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ప్రాంతాల నుండి గిరిజనులను తొలగించడం కూడా ఉద్రిక్తతలకు మరో కారణం. అక్రమంగా గసగసాల సాగును అరికట్టడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే, కుకీ వర్గం దీనిని తమ జీవనోపాధిని దెబ్బతీయడానికి ఉద్దేశించిన చర్యగా భావించింది.
జనాభా, వలసలు: బంగ్లాదేశ్, మయన్మార్ వంటి పొరుగు దేశాల నుండి అక్రమ వలసల కారణంగా జనాభా గణనలో వచ్చిన మార్పులు కూడా ఈ సంఘర్షణకు ఒక అంశంగా మారాయి. ఇది వనరులపై ఒత్తిడి పెంచి, స్థానిక గిరిజన వర్గాలలో అభద్రత భావాన్ని పెంచింది.
“The people of Manipur are moving towards unity, peace, and brotherhood, leaving behind a troubled past. Over the last decade, many Northeastern States have chosen the path of peace and development. I assure you, I stand with you in this journey of growth and prosperity.” — PM… pic.twitter.com/6ZcZKPrIsN
— Janta Journal (@JantaJournal) September 13, 2025
మణిపూర్లో పర్యటించిన రాజకీయ ప్రముఖులు
రాహుల్ గాంధీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రెండుసార్లు మణిపూర్ను సందర్శించారు. ఆయన 2023 జూన్ 29,30 తేదీల్లో సహాయ శిబిరాలను సందర్శించి బాధితులతో మాట్లాడారు. రోడ్డు మార్గంలో వెళ్లేందుకు మొదట అనుమతి లభించకపోవడంతో హెలికాప్టర్లో వెళ్లారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా: అల్లర్లు ప్రారంభమైన కొన్ని రోజులకు అమిత్ షా మణిపూర్ను సందర్శించారు. 2023 మే 29 నుండి జూన్ 1 వరకు మణిపూర్లో నాలుగు రోజుల పాటు పర్యటించారు. శాంతిని పునరుద్ధరించడానికి, సహాయ చర్యలను పర్యవేక్షించడానికి ఆయన అనేక సమావేశాలు నిర్వహించారు.
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా మణిపూర్లో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించడానికి పర్యటించారు.
మల్లికార్జున ఖర్గే: కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే కూడా మణిపూర్ను సందర్శించి అల్లర్ల బాధితులకు సంఘీభావం తెలిపారు. ప్రధాని మోడీ ఆలస్యంగా మణిపూర్ సందర్శించడంపై ఆయన విమర్శలు గుప్పించారు.
అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా శాంతి స్థాపనలో భాగంగా మణిపూర్లో పర్యటించారు. వివిధ వర్గాల నాయకులతో, ఎమ్మెల్యేలతో సమావేశమై శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నించారు.
ఇండియా కూటమి ఎంపీలు: "ఇండియా" కూటమికి చెందిన 21 మంది ఎంపీల బృందం 2023 జూలై 29-30 తేదీల్లో మణిపూర్లో పర్యటించింది. ఈ బృందంలో అధిర్ రంజన్ చౌధరి, గౌరవ్ గొగోయ్, సుష్మితా దేవ్, కరుణానిధి తదితరులు ఉన్నారు. వీరు కూడా సహాయక శిబిరాలను సందర్శించి, బాధిత ప్రజలను కలుసుకుని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు.
ప్రధాని నరేంద్ర మోడీ : అల్లర్లు ప్రారంభమైన తర్వాత చాలా కాలం వరకూ ప్రధాని మోడీ మణిపూర్ను సందర్శించలేదు. ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చిన తర్వాత, ఆయన 2025 సెప్టెంబర్ 13న మణిపూర్ను సందర్శించారు. ఇది అల్లర్లు ప్రారంభమైన తర్వాత ఆయన మొదటి పర్యటన. ఈ పర్యటనలో ఆయన రిలీఫ్ క్యాంపులను సందర్శించి బాధితులతో మాట్లాడారు, అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.