Israel-Netanyahu: ప్రతిదాడులు తప్పవు..లెబనాన్ కు నెతన్యాహు హెచ్చరికలు!
లెబనాన్ పై ఇజ్రాయెల్ మరోసారి ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది.తమ పై వచ్చే దాడులను ఎదుర్కోవడానికి ప్రతీదాడులు తప్పవని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు.
లెబనాన్ పై ఇజ్రాయెల్ మరోసారి ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది.తమ పై వచ్చే దాడులను ఎదుర్కోవడానికి ప్రతీదాడులు తప్పవని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు.
హమాస్ అంతమే లక్ష్యంగా మరోసారి ఇజ్రాయెల్ భీకరదాడులకు దిగింది.ఈ దాడుల్లో పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ సీనియర్ రాజకీయ నాయకుడు ఇస్మాయిల్ బర్హౌమ్ సహా ఐదుగురు చనిపోయినట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి.
గాజా పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హమాస్ సంస్థకు చెందిన కీలక నేతల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో హమాస్ గ్రూప్ రాజకీయ కార్యాలయంలో సభ్యుడిగా ఉన్న బర్దావీల్,అతడి భార్య చనిపోయినట్లు పాలస్తీనా మీడియా వెల్లడించింది.
హమాస్ సంస్థ సైనిక నిఘా చీఫ్ గా ఉన్న ఒసామా టబాష్ ను అంతం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. దక్షిణ గాజాలో తాము జరిపిన దాడుల్లో ఒసామా మరణించాడని క్ఫన్ఫార్మ్ చేసింది. అయితే దీనిపై హమాస్ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు.
హమాస్ లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. తాజాగా చేసిన దాడుల్లో 85 మంది మరణించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం చేసిన వైమానిక దాడుల్లో 400 మంది చనిపోయారు.
గాజా ప్రజలకు మానవత సాయం కూడా సరిగా అందడం లేదు. దీంతో అక్కడ ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. దీనిపై తాజాగా భారత విదేశాంగ శాఖ స్పందించింది. గాజా ప్రజలకు మానవతా సాయం సరఫరా నిరంతరం కొనసాగించాలని పిలుపునిచ్చింది. బంధీలను విడిచిపెట్టాలని కోరింది.
ఈ భీకర దాడులకు ముందు నెతన్యాహు ప్రభుత్వం అమెరికా ప్రభుత్వాన్ని సంప్రదించింది. ఈ విషయాన్ని తాజాగా యూఎస్ అధ్యక్ష భవనం వైట్ హౌస్ వెల్లడించింది.
గాజా స్ట్రిప్, దక్షిణ లెబనాన్, దక్షిణ సిరియాలపై ఇజ్రాయెల్ మళ్ళీ దాడులకు పాల్పడుతోంది. ఈ దాడుల్లో ఇప్పటికి 200 మంది మృతి చెందారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉగ్రముప్పు పొంచి ఉన్న కారణంగానే దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది.
వెస్ట్బ్యాంక్లో చిక్కుకున్న 10 మంది భారతీయ కార్మికులను ఇజ్రాయిల్ రక్షించింది. పని ఇప్పిస్తామని భవన నిర్మాణ కార్మికులను పాలస్థీనా రప్పించి పాస్పోర్ట్ లాక్కొని నిర్భంధించారని IDF వెల్లడించింది. ఇండియన్ పార్ట్పోర్ట్తో ఇజ్రాయిల్లోకి చొరబడుతున్నారట.