New Corona Cases In India | 24 గంటల్లో ఎంత మంది చనిపోయారంటే! | COVID-19 Cases Rising In AP, TS | RTV
పాకిస్తాన్ కు రష్యా ఆయుధాలను సప్లై చేస్తోంది ..దీని కోసం బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకుంది...ఈ వార్తలకు చెక్ పెట్టింది మాస్కో. పాక్ తో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని...భారత్ తో తమ సంబంధాలు చెడగొట్టేందుకు ఈ ప్రచారాలు చేస్తున్నారని స్పష్టం చేసింది.
భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గొప్పలు చెప్పుకున్నారు. దాడులు చేసుకుంటూ, అణ్వాయుధాలను ఉపయోగించే దేశాలతో వ్యాపారాలు చేయనన్నారు. ఇరు దేశాల గ్రేట్ లీడర్స్ తన మాట విని యుద్ధాన్ని ఆపేశారని ధన్యవాదాలు తెలిపారు.
1947 నుంచి పాక్ ఆడుతున్న గేమ్ ముగిసిందని, ఆ దేశంలో ఉన్న ఉగ్రవాదులను భారత్కు అప్పగించాలని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ డిమాండ్ చేశారు. యుద్ధనౌక INS విక్రాంత్ ఆయన శుక్రవారం సందర్శించారు. ఉగ్రవాదుల్ని నాశనం చేయడానికి పాక్ను ఎలాగైనా దెబ్బకొడతామన్నారు.
గుజరాత్లో ఓ ప్రేమ జంట పారిపోయేందుకు దృశ్యం సీన్ రిపీట్ చేసింది. గీతా అహిర్(22)కు భరత్ (21)తో వివాహేతర సంబంధం ఉంది. దూరంగా వెళ్లి బతకాలని వారు అనుకున్నారు. ఈ క్రమంలో హర్జీభాయ్ సోలంకీ(56)ని చంపి, మృతదేహానికి గీత దుస్తులు, పట్టీలు తొడిగి తగలబెట్టారు.
ప్రముఖ రాజకీయ నాయకుడు గులాం నబీ ఆజాద్ మంగళవారం కువైట్లో అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన రియాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆజాద్ కు కడుపులో నొప్పి వచ్చిందని, కువైట్ లో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని సన్నిహిత వర్గాలు తెలిపాయి.