Himachal pradesh: వీడు టీచర్ కాదు టార్చర్.. 24 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులు
హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో 24 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించినందుకు ఓ ఉపాధ్యాయుడిని పోలీసులుఅరెస్టు చేశారు.
హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో 24 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించినందుకు ఓ ఉపాధ్యాయుడిని పోలీసులుఅరెస్టు చేశారు.
హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి 200 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, 25 మంది గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
పెళ్లింట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అదుపు తప్పి కారు లోయలో పడటంతో ఐదుగురి మృతి చెందారు. ఈ దుర్ఘటన హిమాచల్ప్రదేశ్లోని మండీ జిల్లాలో పాండో ఆనకట్ట సమీపంలోని బఖ్లి రోడ్డుపై జరిగింది. మృతుల్లో ఎనిమిది నెలల చిన్నారి కూడా ఉన్నాడు.
టెర్రరిస్టులు ఇంకా భారత్ లోనే ఉన్నారు. వారి కోసం భద్రతా దళాల వేట కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పహల్గామ్ తరహాలో మరోసారి ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. దీంతో హిమాచల్ ప్రదేశ్ లో హై అలెర్ట్ ప్రకటించారు.
తన ఇంటి కరెంట్ బిల్లు రూ.లక్ష వచ్చిందంటూ మండి ఎంపీ కంగనా రౌనత్ చేసిన గొడవ రాజకీయ చర్చకు కారణమైంది. ఇది బీజేపీ, కాంగ్రెస్ గొడవగా మారింది. దాంతో రంగంలోకి దిగిన విద్యుత్ శాఖ అదంతా ఆమె ఇంటి కరెంట్ బిల్లేనంటూ లెక్కలతో సహా చూపించింది.
హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బంబర్ ఠాకూర్పై కాల్పులు జరిగాయి. ఆయనపై దుండగులు 12 రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ కాల్పుల్లో బంబర్ ఠాకూర్ తీవ్రంగా గాయాలపాలయ్యారు.
హోలీ రోజున, దేశంలోని అనేక రాష్ట్రాల్లో తెల్లవారుజామున భూమి కంపించింది. లడఖ్ నుండి జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ వరకు భూమి కంపించింది. జమ్మూ కాశ్మీర్లలో తెల్లవారుజామున 2.50 గంటలకు హిమాచల్ ప్రదేశ్లో రాత్రిపూట భారీ భూకంపం సంభవించింది .
పురిట్లో బిడ్డను కోల్పోయిన మహిళా ఉద్యోగులకు 60 రోజుల పాటు ప్రసూతి సెలవులు ఇవ్వనున్నట్లు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నవ మాసాలు మోసిన తర్వాత బిడ్డ పురిట్లోనే చనిపోతే ఆ బాధ వర్ణణాతీతం. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
హిమాచల్ ప్రదేశ్లో జై భీం సీన్ రిపీట్ అయ్యింది. అత్యాచార కేసులో నిందితుడు పోలీసుల కస్టడీలో చనిపోయాడు. అతని స్థానంలో మరో వ్యక్తిని పోలీసులు చేర్చారు. ఈ కేసులో 8 మంది పోలీస్ అధికారులకు సీబీఐ ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చి జీవితఖైదు విధించింది.